‘భీమ్లా’ సెట్స్ లో త్రివిక్రమ్.. అసలు కారణం ఇదే!

సినిమా సెట్స్ లో దర్శకుడిదే రాజ్యం. అంతా దర్శకుడు చెప్పిన మాట వినాల్సిందే. మరి డైరక్టర్ కాకుండా, మరో వ్యక్తి ఆజమాయిషీ చేస్తే ఎలా ఉంటుంది? భీమ్లానాయక్ సినిమా సెట్స్ లో అలానే జరిగిందనేది…

సినిమా సెట్స్ లో దర్శకుడిదే రాజ్యం. అంతా దర్శకుడు చెప్పిన మాట వినాల్సిందే. మరి డైరక్టర్ కాకుండా, మరో వ్యక్తి ఆజమాయిషీ చేస్తే ఎలా ఉంటుంది? భీమ్లానాయక్ సినిమా సెట్స్ లో అలానే జరిగిందనేది బయట టాక్. దర్శకుడు సాగర్ చంద్ర ఉన్నప్పటికీ, త్రివిక్రమే అన్నీ తానై భీమ్లానాయక్ ను ముందుకు నడిపించారనేది బహిరంగ రహస్యం.

ఎట్టకేలకు దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించాడు. స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా.. అంతకుమించి త్రివిక్రమ్ ను ఇన్ వాల్వ్ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టాడు నాగవంశీ. గతంలో పవన్ కల్యాణ్ కు అజ్ఞాతవాసి రూపంలో డిజాస్టర్ ఇచ్చారు ఈ నిర్మాతలు. అందుకే ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు త్రివిక్రమ్ ను సెట్స్ కు తీసుకొచ్చారట.

“భీమ్లానాయక్ సెట్స్ లోకి త్రివిక్రమ్ ను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. పవన్ కల్యాణ్ విషయంలో మేం తప్పు చేశాం. తప్పు జరిగిపోయింది. ఆ తప్పు మళ్లీ రిపీట్ అవ్వకూడదనేది మా ఆలోచన. ఆ భయం, బాధ్యతతోనే త్రివిక్రమ్ ను భీమ్లానాయక్ సెట్స్ లోకి రమ్మని మేం రిక్వెస్ట్ చేశాం. పవన్ కల్యాణ్ కు, ఆయన ఫ్యాన్స్ కు బాకీ ఉన్నాం. ఆ బాకీ తీర్చాల్సిందే.”

త్రివిక్రమ్ సెట్స్ లో ఉన్నప్పటికీ, డైరక్షన్ చేసింది మాత్రం సాగర్ చంద్రనే అంటున్నాడు నాగవంశీ. అంతేకాదు.. త్రివిక్రమ్ రాసింది స్క్రీన్ పైకి తీసుకురావడం అంత ఈజీ కాదని.. ఈ విషయంలో దర్శకుడిగా సాగర్ చంద్ర సక్సెస్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.

భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న వస్తుందా, ఏప్రిల్ 1న వస్తుందా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదంటున్నాడు ఈ నిర్మాత. ఒకవేళ, ఏప్రిల్ 1న సినిమా థియేటర్లలోకి వస్తే అది ఆర్ఆర్ఆర్ కు పోటీ కాదంటున్నాడు. అప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజైపోతుంది కాబట్టి, అది రిలీజైన రెండో వారానికి తమకు కూడా థియేటర్లు దొరుకుతాయంటున్నాడు నాగవంశీ.