విశాఖలో ప్రత్యక్షమైన అదానీ ప్రతినిధులు ?

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అంటూ గత 34 రోజులుగా విశాఖలో ఉక్కు ఉద్యమం సాగిపోతోంది. మరి కొద్ది రోజుల్లో ఉక్కు కార్మికులు సమ్మె బాట కూడా పట్టనున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం కూడా…

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అంటూ గత 34 రోజులుగా విశాఖలో ఉక్కు ఉద్యమం సాగిపోతోంది. మరి కొద్ది రోజుల్లో ఉక్కు కార్మికులు సమ్మె బాట కూడా పట్టనున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక ఉక్కు ఉద్యమం నేపధ్యంలో విశాఖలో హఠాత్తుగా అదాని గ్రూప్ ప్రతినిధులు ప్రత్యక్షం కావడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఉక్కు కార్మికలోకం గర్జనల నేపధ్యంలో అదాని ప్రతినిధులు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారంటూ వస్తున్న వార్తలు కూడా చర్చనీయాంశం అవుతోంది.

మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే అదాని గ్రూప్ కైవశం చేసుకుంటుంది అన్న వార్తలు కూడా సంచలనంగా మారుతున్నాయి. ఈ క్రమంలో నానాటికీ ఉధృతం అవుతున్న ఉక్కు ఉద్యమం గురించి స్వయంగా తెలుసుకోవడానికి విశాఖకు అదాని ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. 

మొత్తానికి విశాఖ ఉక్కు వేడి ఓ వైపు ఉంటే అదాని ప్రతినిధుల అనూహ్య పర్యటన, పోలీసు వర్గాలతో భేటీ కావడం వంటి పరిణామాలను బేరీజు వేసుకున్న వారికి క్లైమాక్స్ కి కధ చేరిందా అన్న డౌట్లు వస్తున్నాయి.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్