ఆ స్టార్ హీరో సోషల్ మీడియాకు పూర్తిగా దూరం

అజిత్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. నిన్నటివరకు ఈ హీరో సోషల్ మీడియాలోకి వస్తాడని అభిమానులంతా ఎదురుచూశారు. దీనికి కారణం అజిత్ లెటర్ హెడ్ తో ఓ లెటర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడమే. అయితే…

అజిత్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. నిన్నటివరకు ఈ హీరో సోషల్ మీడియాలోకి వస్తాడని అభిమానులంతా ఎదురుచూశారు. దీనికి కారణం అజిత్ లెటర్ హెడ్ తో ఓ లెటర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడమే. అయితే దీనిపై అజిత్ క్లారిటీ ఇచ్చాడు. తను సోషల్ మీడియాలోకి వచ్చేది లేదంటూ తన లీగల్ టీమ్ తో ఏకంగా నోటీసు ఇప్పించాడు ఈ హీరో.

“అజిత్ రాసినట్టు నిన్నట్నుంచి ఓ లేఖ సర్కులేట్ అవుతున్నట్టు మా (లీగల్ టీమ్) నోటీసుకు వచ్చింది. త్వరలోనే అజిత్ మళ్లీ సోషల్ మీడియాలోకి రాబోతున్నట్టు అఫీషియల్ ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నట్టు ఆ లేఖలో ఉంది. అది మాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అది ఫేక్ లెటర్ హెడ్. అందులో అజిత్ సంతకం కూడా ఫోర్జరీ చేశారు.”

ఇలా నిన్నట్నుంచి నడుస్తున్న పుకార్లకు అజిత్ లీగల్ టీమ్ చెక్ పెట్టింది. కేవలం ఇక్కడితో ఆగలేదు అజిత్ లీగల్ టీమ్. నకిలీ లెటర్ ను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసిన వ్యక్తిని పట్టుకొని లీగల్ నోటీసు ఇస్తామని ప్రకటించింది.

“మా క్లయింట్ (అజిత్) గతంలో కూడా పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. తనకు ఎలాంటి సోషల్ మీడియా ఎకౌంట్ లేదని ఎన్నోసార్లు స్పష్టంచేశారు. అంతేకాదు, తనకు ఎలాంటి ఫేన్ పేజీ లేదు. తనపై ఉన్న ఫ్యాన్ పేజీలకు కూడా అతడు మద్దతు ఇవ్వడం లేదు. ప్రేక్షకులంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం”

ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు, వ్యక్తిగత ఎకౌంట్లు అజిత్ చెప్పినట్టుగా కొంత సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నాయని.. తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని అజిత్ చెప్పినట్టుగా పోస్ట్ చేయడం చట్టరీత్యా నేరం అవుతుందని పబ్లిక్ నోటీసులో పేర్కొన్నారు. తాజా నోటీసులతో అజిత్ ఇకపై సోషల్ మీడియాలోకి రాడనే విషయం తేలిపోయింది.

వీడు మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకున్నాడు