జనసేనాని పవన్కల్యాణ్ ఏనాడూ అధికారంలో లేరు. దీంతో ఆయనపై అవినీతి విమర్శలు చేసే అవకాశం ప్రత్యర్థులకు ఉండదు. దీంతో రాజకీయంగా పవన్ను టార్గెట్ చేయాలని అనుకునే వాళ్లకు ఆయన పెళ్లిళ్లు అస్త్రాలయ్యాయి. తాజాగా పవన్కల్యాణ్ పెళ్లిళ్లపై మంత్రి అంబటి రాంబాబు ఓ రేంజ్లో ర్యాగింగ్ చేశారు. అసలే అంబటి వెటకారంలో దిట్ట. ఇక తమపై విమర్శలు చేసే పవన్ కల్యాణ్ను ఊరికే ఆయన వదులుతారా?
ఇవాళ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ భీమవరంలో పవన్కల్యాణ్ తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను హెచ్చరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ పల్లకీలు మోస్తున్న పవన్కు విప్లవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఢిల్లీలో పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయన్న పవన్కల్యాణ్, ఆ పలుకుబడిని రాష్ట్రానికి మంచి చేసేందుకు ఉపయోగించాలని హితవు చెప్పారు. అందుకు విరుద్ధంగా వైఎస్ జగన్ను బెదిరిస్తావా? అని మండిపడ్డారు.
నలుగురు విప్లవకారుల పేర్లు తెలిసినంత మాత్రాన విప్లవకారుడివి అవుతావా? అని అంబటి ప్రశ్నించారు. వివాహ వ్యవస్థలో విప్లవం తెచ్చావా? అని సెటైర్ విసిరారు. వివాహ వ్యవస్థపై పవన్కు నమ్మకం లేదన్నారు. పెళ్లిళ్ల వీరుడిగా పవన్ గురించి అంబటి చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తి ప్రజలకు నీతులు చెబుతున్నాడని ధ్వజమెత్తారు.
పవన్ మాటలు సంస్కార హీనంగా వున్నాయని విమర్శించారు. పవన్ విషయంలో యువత అప్రమత్తంగా వుండాలని సూచించారు. పవన్ పెళ్లిళ్లపై మంత్రులు, వైసీపీ నేతలు ర్యాగింగ్ చేస్తుండడంతో జనసేన నేతలు ఇరిటేట్ అవుతున్నారు. మరోవైపు నెటిజన్లు ఇదేం ర్యాగింగ్ బాబోయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.