ప‌వ‌న్‌తో స‌రసం చూశారా…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మంత్రి అంబ‌టి రాంబాబు రాజ‌కీయ స‌ర‌సాలాడుతున్నారు. వారాహియాత్ర‌లో భాగంగా త‌ణుకులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంతో ఊగిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ను రోజూ ఇలా చూసి జ‌నం కూడా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మంత్రి అంబ‌టి రాంబాబు రాజ‌కీయ స‌ర‌సాలాడుతున్నారు. వారాహియాత్ర‌లో భాగంగా త‌ణుకులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆవేశంతో ఊగిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ను రోజూ ఇలా చూసి జ‌నం కూడా లైట్ తీసుకుంటున్నారు. ఒక‌ప్పుడు ప‌వ‌న్ ఏం మాట్లాడ్తారో అని అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లో కాస్త ఆస‌క్తి ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

హా, ఏముంది… సీఎం జ‌గ‌న్‌ను తిట్ట‌డం త‌ప్ప ప‌వ‌న్ ప్ర‌సంగంలో కొత్త‌ద‌నం ఏముందనే అభిప్రాయానికి జ‌నం వ‌చ్చారు. అయితే ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డానికి మంత్రి అంబ‌టి రాంబాబు రెడీగా వుంటారు. తాజాగా ప‌వ‌న్‌పై అంబ‌టి పంచ్‌లు విసిరారు. అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ ప్యాకేజీ యాత్ర పూర్తి చేసినందుకు అభినంద‌న‌లన్నారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కోపం వ‌స్తుంద‌ని, జ‌గ‌న్‌ను జ‌గ్గూభాయ్ అంటే త‌మ‌కూ ఆగ్ర‌హం క‌లుగుతుంద‌న్నారు. ఇక‌పై ప‌వ‌న్‌ను ఏక‌ప‌త్నీవ్రతుడ‌ని పిలుస్తామ‌ని వెట‌క‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇదో కొత్త ర‌కం టార్చ‌ర్‌. ప‌వ‌న్‌ను బ‌హుభార్య‌త్వం క‌లిగిన నాయ‌కుడిగా ఇంత కాలం వైసీపీ ఆట ప‌ట్టిస్తోంది. దానిపై ప‌వ‌న్ అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో రూట్ మార్చిన‌ట్టు అంబ‌టి చెప్పుకొచ్చారు. ప‌వ‌న్‌ను ఏక‌ప‌త్నీవ్ర‌తుడితో పోల్చ‌డం అంటే శ్రీ‌రామ చంద్రుడితో స‌మానంగా చూడ‌డం అన్న మాట‌.  

త‌న‌ను ఏక‌ప‌త్నీవ్ర‌తుడంటే ప‌వ‌న్ త‌ట్టుకోగ‌ల‌రా? ఇది కూడా ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న పెళ్లిళ్ల‌ను వెట‌క‌రించడంగా ఆయ‌న భావిస్తారేమో! వైసీపీతో వ్య‌వ‌హారం ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే చందంగా త‌యారైంది. మ‌రీ ముఖ్యంగా కాపు మంత్రులే ప‌వ‌న్ పెళ్లిళ్లను టార్గెట్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు కొత్త బిరుదు ఇవ్వ‌డంపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.