పవన్ ను చూస్తే జాలేస్తుంది!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, త‌న స‌న్నిహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి అంబ‌టి రాంబాబు. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ డ్రామాలు అడుతున్నార‌ని, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను అమ‌రావ‌తి యాత్ర పేరుతో రెచ్చ‌గోడుతున్నార‌ని, యాత్ర…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, త‌న స‌న్నిహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి అంబ‌టి రాంబాబు. అమ‌రావ‌తి పేరుతో టీడీపీ డ్రామాలు అడుతున్నార‌ని, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌ను అమ‌రావ‌తి యాత్ర పేరుతో రెచ్చ‌గోడుతున్నార‌ని, యాత్ర పేరుతో తొడ‌లు గొడుతున్న‌రంటూ మండిప‌డ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. విశాఖ‌కు రాజ‌ధాని రాకుండా ప‌వ‌న్, చంద్ర‌బాబు నాయుడు అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. 

ఉత్త‌రాంధ్ర ఒక్క సాగునీటి పాజెక్టు కూడా చంద్ర‌బాబు ప్రారంభించలేద‌ని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడే హ‌క్కు చంద్ర‌బాబుకు లేద‌ని, వంశ‌ధార ప్రాజెక్ట్ వివాదాలు గురించి చంద్ర‌బాబు ఎప్పుడు పట్టించుకోలేద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక ఒడిస్సా సీఎంతో మాట్లాడి స‌మ‌స్య పరిష్కారించార‌న్నారు. ఉత్త‌రాంధ్ర అభివృధి చేసింది వైయ‌స్ఆర్, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అన్నారు. 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూస్తుంటే జాలేస్తోంద‌ని, రాజ‌కీయాలు ఫుల్ టైం కేటాయించాల‌ని ఆలోచ‌న లేకుండా ట్వీట్ట‌ర్ లో చంద్ర‌బాబు చెప్పిన మాట‌లు ట్వీట్లు చేసుకుంటూ రాజ‌కీయం చేస్తున్నార‌ని అన్నారు. ఒక వైపు జ‌న‌సైనికులు, వీర మ‌హిళ‌లు ప‌వ‌న్ కోసం పోరాటం చేస్తుంటే ప‌వ‌న్ మాత్రం చంద్ర‌బాబు కోసం పోరాటం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. జనసేన వీర మహిళలు ఎవరి మీద వీరత్వం ప్రదర్శిస్తున్నారో. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో వారికే క్లారిటీ లేదన్నారు. ప‌వ‌న్ ను ముందు పెట్టి చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నార‌ని ఈ విష‌యం జ‌న‌సైనికులు తెలుసుకోవాల‌న్నారు.

ఒక వైపు టీడీపీకి క‌న్ను కొడుతూ బీజేపీతో ఉన్నామంటార‌ని, రాష్ట్రంలో 175 సీట్ల‌లో పోటీ చేస్తామ‌ని చెప్పే దమ్ము జ‌న‌సేన‌కు ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు. ప‌వ‌న్, చంద్ర‌బాబు ఇద్దరు తోడు దొంగలు అంటూ మండిప‌డ్డారు. మూడు ప్రాంతాలు అభివృధి చెందితే ప్రాంతాల మ‌ధ్య‌లో అస‌మాన‌తలు తొల‌గిపోతాయ‌ని అందుకే సీఎం జ‌గ‌న్ మూడు ప్రాంతాల‌ను స‌మాన దృష్టిలో చూస్తున్నార‌న్నారు.