ఢిల్లీ లిక్కర్ స్కాంలో మ‌రో అరెస్ట్!

దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. గ‌త మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ క‌విత మాజీ సీఏ బుచ్చిబాబు,  గౌత‌మ్ మ‌ల్హోత్రాను ఆరెస్ట్ చేసిన ఈడీ…

దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. గ‌త మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ క‌విత మాజీ సీఏ బుచ్చిబాబు,  గౌత‌మ్ మ‌ల్హోత్రాను ఆరెస్ట్ చేసిన ఈడీ ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి త‌న‌యుడు మాగుంట రాఘ‌వ రెడ్డిని ఆరెస్ట్ చేసింది. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ చార్జిషీటులో ప‌లువురు కీల‌క వ్య‌క్తుల‌పై అభియోగాలు న‌మోదు చేసింది.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ క‌విత‌, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్ల‌ను కూడా అందులో ప్ర‌స్త‌వించింది.