షర్మిల ప్రాణాలకు టీడీపీ రక్షణ వలయం!

వైఎస్ షర్మిల 2019లో బై బై బాబూ అన్నపుడు టీడీపీ మండిపోయింది. అదే షర్మిల ఇపుడు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక సొంత అన్న జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే టీడీపీ…

వైఎస్ షర్మిల 2019లో బై బై బాబూ అన్నపుడు టీడీపీ మండిపోయింది. అదే షర్మిల ఇపుడు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక సొంత అన్న జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే టీడీపీ చోద్యం చూస్తూ వినోదిస్తోంది. ఒకనాడు షర్మిల మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి ఆమెని దారుణంగా విమర్శించిన టీడీపీకి ఇపుడు షర్మిల మంచి నేస్తం అయింది.

టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే షర్మిల మీద ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. షర్మిల ఎవరు అనుకుంటున్నారు ఆమె వైఎస్సార్ కి ప్రియమైన కూతురు అని అంటున్నారు. ఆయన తన ఆస్తులలో ఆమెకు ప్రత్యేకమైన వాటా రాశారు అని అయ్యన్న తనకు తెలిసిన విషయంగా చెబుతున్నారు.

ఆమె ఆస్తులను ఇవ్వకుండా జగన్ ఇబ్బంది పెడుతున్నారని కూడా అయ్యన్న ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఇంకాస్తా ముందుకెళ్ళి షర్మిల ప్రాణాలకు ముప్పు అని సంచలన కామెంట్స్ ని అయ్యన్న చేయడం విశేషం. ఆమెను ప్రాణ హాని ఉందని ఆయన అంటున్నారు. వెంటనే షర్మిలకు భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

షర్మిల వేరే పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె నిన్నటిదాకా వైసీపీలో ఉన్న నేత ఇపుడు ఆమె కాంగ్రెస్ లోకి వచ్చి జగన్ ని విమర్శించే సరికి అయ్యన్నకు ఆమె నచ్చిన నేత అయిపోయారా సెటైర్లు పడుతున్నాయి. అంతే కాదు ఆమె ప్రాణాలకు ముప్పు అని కూడా అయ్యన్న విమర్శలు చేయడం ఏంటని అంటున్నారు. ఆమె విషయంలో ఇంతలా టీడీపీ నేతలు ఆసక్తిని చూపిస్తున్నారు అంటేనే కాంగ్రెస్ తో టీడీపీకి అవగాహన ఉందని అనుమానాలే నిజం అని వైసీపీ నేతలు అంటున్నారు.

షర్మిల వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆమెకు ఏదైనా జరిగితే వైసీపీ ప్రభుత్వానికే మచ్చ అన్నది అందరికీ తెలిసిందే. మరి రాజకీయంగా వైఎస్సార్ కుటుంబ వైరాన్ని సొమ్ము చేసుకుందామని చూస్తున్న టీడీపీకి షర్మిలకు ముప్పు ఎవరి నుంచి ఉంటుందో  కూడా తెలియదా అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఏపీలో చూస్తే సంప్రదాయ రాజకీయాలు మానేసి క్షుద్ర రాజకీయాలు మొదలై చాలా కాలం అయింది అని అంటున్నారు. అందువల్ల నిజంగా షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంటే ఆమె జాగ్రత్తగా ఉండాల్సి ఉందని అంటున్నారు. లాజిక్ ని సైతం మిస్ అవుతూ టీడీపీ చేస్తున్న ఈ తరహా ఆరోపణలతో షర్మిల ప్రాణాలకు నిజంగా ముప్పు ఏ వైపు నుంచి అన్నది కూడా ఆలోచించేలా చేస్తోంది అంటున్నారు.