విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఒక‌రి మృతి!

విజ‌య‌వాడ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు మొగ‌ల్‌రాజుపురంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఒక‌రు మృతి చెంద‌గా, న‌లుగురు గాయాల‌పాల‌య్యారు. కొండ చ‌రియ‌ల శిథిలాల కింద కొంత మంది ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు , రెస్క్యూ…

విజ‌య‌వాడ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు మొగ‌ల్‌రాజుపురంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఒక‌రు మృతి చెంద‌గా, న‌లుగురు గాయాల‌పాల‌య్యారు. కొండ చ‌రియ‌ల శిథిలాల కింద కొంత మంది ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు , రెస్క్యూ టీమ్ అక్క‌డికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయ‌డానికి శ్ర‌మ‌టోడుస్తున్నారు.

గ‌త నెలాఖ‌రులో మొద‌లైన భారీ వ‌ర్షాల‌కు ఇదే రీతిలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి కొంద‌రు మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంద‌రు గాయప‌డ్డారు. తాజాగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌డం, ఒక‌రి మృతి… విజ‌య‌వాడ‌లో వాస్త‌వ ప‌రిస్థితిని ప్ర‌తిబింబిస్తోంది. అందుకే న‌గ‌ర వాసులు ఆందోళ‌న చెందుతున్నారు.

మ‌రోవైపు భారీ వ‌ర్షం కురుస్తుంటే, స‌హాయ‌క చ‌ర్య‌లు, ఇళ్ల శుభ్రం చేసుకునే ప‌నుల‌కు అడ్డంకి. మ‌రో తుపాను హెచ్చ‌రిక నేప‌థ్యంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలే మెండు. ప్ర‌కృతి సృష్టించే విల‌యాల్ని అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రం కాదు. ప్ర‌భుత్వాల చేతుల్లో కూడా ఏమీ వుండ‌దు. అంద‌రూ ప్రేక్ష‌క‌పాత్ర పోషించాల్సిందే.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నిజాయితీగా వ‌ర‌ద బాధితుల కోసం ఏదో చేయాల‌ని ప‌ని చేస్తున్నారు. కానీ వ‌ర్షం అన్నింటికి అడ్డంకిగా త‌యారైంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

3 Replies to “విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. ఒక‌రి మృతి!”

  1. TDP ki support chestunna vedhavala Amma akka,Chelli,pellam vallu sachi povali appudu badha telusuddi.vedhava Nakodukulu enka support chestunnaru siggu lekunda….eppudu Naa meeda padtaru naaku M ki puttinollu

Comments are closed.