జగన్ మీద కక్ష నిరుపేదల మీద చూపిస్తారా?

బుడమేరు కారణంతా వాటిల్లిన వరదముప్పు తరవాత ప్రభుత్వం తీరును, వారి అనుకూల పచ్చమీడియా పన్నుతున్న పన్నాగాలను గమనిస్తే.. అనేక భయాలు కలుగుతున్నాయి. Advertisement వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షను…

బుడమేరు కారణంతా వాటిల్లిన వరదముప్పు తరవాత ప్రభుత్వం తీరును, వారి అనుకూల పచ్చమీడియా పన్నుతున్న పన్నాగాలను గమనిస్తే.. అనేక భయాలు కలుగుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షను ఈ ప్రభుత్వం నిరుపేదల మీద చూపించబోతున్నదా అనే భయం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడానికి లక్షల మందికి ఇంటిస్థలాలు పంపిణీ చేశారు. జగనన్న కాలనీలుగా అవి రూపుదిద్దుకున్నాయి. అదే సమయంలో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరించే ఏర్పాటుచేశారు. చాలావరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి కూడా.

అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ఇళ్ల మీద, నిర్మాణాల మీద జగనన్న కాలనీల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పచ్చమీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే.. ప్రభుత్వం కుట్రకు బీజం పడినట్టుగా అనిపిస్తోంది.

జగనన్న కాలనీలు అన్నీ కూడా నీటి మడుగులు అయిపోయాయని, ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని.. ప్రజల్ని భీతావహుల్ని చేసే కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఈ పచ్చమీడియా కథనాలు కూడా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరుగుతుంటాయనే సంగతి ప్రజలకు తెలుసు.

ఈ కథనాలను ఆధారం చేసుకుని.. ప్రస్తుతానికి జగనన్న కాలనీలకు ఇచ్చిన స్థలాలను పూర్తిగా రద్దు చేసేసి.. మళ్లీ ఇస్తాం అనే మిషమీద వాయిదా వేయడానికి గానీ, లేదా, నిర్మాణాలు కూడా పూర్తవుతూ ఉన్నచోట్ల.. అసలు ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ద్రోహం చేయడానికి గానీ ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

అలా కాకుండా చంద్రబాబు నాయుడు సర్కారు… జగనన్న కాలనీల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నదని అనిపిస్తే.. అక్కడ సరైన డ్రైనేజీ సదుపాయాలు కల్పించడం గానీ.. లేదా, వాటిని నీటిమడుగులుగా మార్చే కాలువలు వంటివి ఉంటే వాటికి సంబంధించిన జాగ్రత్త చర్యలు గానీ చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

జగన్ మీది కక్షను, జగనన్న కాలనీల్లోని ఇళ్లు పొందిన ప్రజల మీద చూపించకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నారు.

21 Replies to “జగన్ మీద కక్ష నిరుపేదల మీద చూపిస్తారా?”

  1. నిజమెగా! ముంపు ప్రంతాలలొ మార్కెట్ విలువకి 3 ఇంతలు రెట్లు పెట్టి వాళ్ళు భూములు కొనిపించుకొని Y.-.C.-.P స్తానిక నాయకులు డబ్బులు చెసుకున్నారు.

  2. కొంచెం కూడా సిగ్గులేదా GA….10 లక్షలు కూడా విలువ చెయ్యని ముంపు ప్రాంతాలను 50 లక్షలకు GOVT తో కొనిపించీ… వాటిని బలవంతం గా పేదలకు అంటగట్టి…అక్కడ ఇళ్లు కట్టకపోతే లాక్కుంటం అని బెదిరించి మరి వాళ్ళతో ఇళ్లు కట్టించి ,అప్పుల పాలు చేసి…వాళ్ళని నాశనం చేసింది ఎవరు GA….

  3. Babu మీద ఒక కులం మీద కక్ష తో అమరావతి ఆపేయలేద? ఇప్పుడు కూడా అమరావతి మునిగి పోయింది అని విష ప్రచారం చెయ్యడం లేదా..

  4. కాలనీలు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు..అవి ఊళ్ళు కాదు పిచ్చుక గూళ్ళు..స్లం ల కన్నా ఘోరం.ఇదేనా రా పేదల మీద ఉన్న అభిమానం ..గౌరవం.??.ఎం చెయ్యాలో ఎలా చేయాలో మాకు తెలుసు లే..నీ ఏ..దవ సలహాలు ఆపి ఎదో ఒక పుల్లలు పెట్టె ఆర్టికల్స్ రాసుకో.

Comments are closed.