చంద్రబాబు బుర్రలో నేర ఆలోచనలు!

వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుర్రలో ఎలాంటి సరికొత్త వక్ర ఆలోచనలు నడుస్తున్నాయి? ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆ నాయకులను బదనాం చేయడానికి…

వచ్చే ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుర్రలో ఎలాంటి సరికొత్త వక్ర ఆలోచనలు నడుస్తున్నాయి? ప్రత్యర్థి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆ నాయకులను బదనాం చేయడానికి ఆయన ఎలాంటి సరికొత్త వ్యూహరచన చేస్తున్నారు.. అనే మీమాంస రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది? అయితే తతిమ్మా ఆలోచనల సంగతి ఏమో గానీ చంద్రబాబు నాయుడు బుర్రలో ఒక రకమైన నేరపూరిత కార్యకలాపాల స్కెచ్ సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ‘బాదుడే బాదుడు’ అనే నాటకీయ కార్యక్రమంలో నందిగామలో రోడ్లమీద తిరుగుతూ చంద్రబాబు నాయుడు చెప్పిన కొన్ని మాటలు ఆయన నేరపూరిత ఆలోచనలను సంకేతమాత్రంగా తెలియజేస్తున్నాయి!

‘‘వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైలుకు పరిమితమవుతారని’’ అంటూ తన కడుపు మంటను బయటపెట్టిన చంద్రబాబు నాయుడు, మరికొన్ని అనుమానాస్పద మాటలను కూడా అన్నారు. రానున్న రోజుల్లో కోడి కత్తి లాంటి నాటకాలకు తెరతీసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, అలాంటి నాటకాలను నమ్మవద్దు అని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.

ఈ వాక్యాల అర్థం చాలా అనుమానాస్పదంగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశాన్ని, తమ తొత్తు పార్టీ అయినటువంటి జనసేన కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నదని దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు మరేమీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు సరికొత్తగా ఈ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. 

అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి కత్తి లాంటి నాటకాలు చేస్తారంటూ సంకేతాలు ఇస్తున్నారు. అంటే భవిష్యత్తులో వైకాపా నాయకుల మీద దాడులు చేయించడానికి ఆయన వ్యూహరచన చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. దాడులకు ముందుగానే స్కెచ్ వేసుకొని, అలా దాడులు జరిగిన సందర్భాలలో అవన్నీ కోడి కత్తి లాంటి నాటకాలని తమ పార్టీకి సంబంధం లేదని బుకాయించడానికి ఇప్పటినుంచే ఈ కుట్రపూరిత మాటలు మాట్లాడుతున్నారా అని అభిప్రాయమూ ఏర్పడుతోంది. 

అసలే మంత్రుల మీద విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల దాడి చేయడం జరిగింది. జనసేన గూండాలు అన్నా కూడా.. తెలుగుదేశం పార్టీకి బీ-టీమ్ గూండాయిజమే అనే సంగతి అందరికీ తెలుసు. రాష్ట్రంలో మరింత వైసీపీ నాయకుల మీద దాడులు జరగడానికి అవకాశం ఉన్నదంటూ.. ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి అందాయి. ఈ నివేదికల్లో సంగతి బయటకు రాగానే.. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ భుజాలు తడుముకున్నారు. 

ఇప్పుడు చంద్రబాబునాయుడు.. భవిష్యత్తులో కోడికత్తి లాంటి నాటకాలు ఉంటాయని అంటున్నారు. అంటే.. ఈ రెండు పార్టీలు కలిసి కుట్రపూరితంగా దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.

మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకుల మీద ఎక్కడికక్కడ దాడులు చేయడానికి.. ఆ తర్వాత ఆ దాడులతో తమకు సంబంధం లేదని.. వైసిపి పార్టీ నాటకాలాడుతోందని బుకాయించడానికి వీలుగా చంద్రబాబు నవీన రాజకీయ పంథాను అనుసరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజంగానే దాడులు చేసేంత నేరమయ ఆలోచనలకు దిగితే చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా బుకాయించినప్పటికీ తగిన శాస్తి అనుభవించక తప్పదని కూడా అనుకుంటున్నారు.