విశాఖకు విదేశాంగ మంత్రి … ఎందుకోసమంటే…?

ఆయన విదేశాంగ మంత్రి. నిత్యం దౌత్య పరమైన వ్యవహారాలతో బిజీగా ఉంటారు. ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే ఫారిన్ అన్నట్లుగానే షెడ్యూల్ ఎపుడూ హడావుడిగా ఉంటుంది. అలాంటి భారత విదేశాంగ మంత్రి జై శంకర్…

ఆయన విదేశాంగ మంత్రి. నిత్యం దౌత్య పరమైన వ్యవహారాలతో బిజీగా ఉంటారు. ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే ఫారిన్ అన్నట్లుగానే షెడ్యూల్ ఎపుడూ హడావుడిగా ఉంటుంది. అలాంటి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఫస్ట్ టైమ్ విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మెగాసిటీకి రావడం ఇదే ప్రధమం.

ఇంతకీ జై శంకర్ విశాఖ టూర్ ఎందుకోసం అన్నది కనుక చూసుకుంటే ఆయన వచ్చేది కేవలం పార్టీ కార్యక్రమాల కోసం అంటున్నారు. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన ముగిసిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా పదిహేను రోజుల పాటు అన్ని చోట్లా పెద్ద ఎత్తున పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో కేంద్ర మంత్రులు అంతా పాలుపంచుకుని కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ ఎనిమిదేళ్ళలో దేశానికి ఏం చేసింది అన్న సంగతిని చెబుతారు. ఈ క్రమంలో జై శంకర్ విశాఖలో పర్యటిస్తారు అంటున్నారు. 

ఇక ఆయన కంటే ముందు ఈ నెల 31న మరో కేంద్ర మంత్రి శర్వానంద్ కూడా విశాఖ టూర్ చేస్తున్నారు. ఆయన సైతం మోడీ ప్రభుత్వ విజయాల గురించి వివరిస్తారుట.

ఎనిమిదేళ్ల మోడీ దేశానికి ఏమి చేశారు అన్నది మంత్రులు విడతల వారీ పర్యటనలో చెప్పదలచుకున్నారు. ఒక విధంగా చూస్తే బీజేపీ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా విశాఖ వంటి మెగాసిటీలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది అని తెలుస్తోంది.