కామెడీ ఫేస్‌కి సీరియస్ డైలాగ్ సెట్ అవదు లోకేషా!

లోకేష్ ది కామెడీ ఫేస్ అని తేల్చేశారు వైసీపీ యువ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎంత సీరియస్ నెస్ క్రియేట్ చేసినా కామెడీ ఫేస్ కి ఎక్కడా సెట్ అవడం లేదు లోకేశా అంటూ…

లోకేష్ ది కామెడీ ఫేస్ అని తేల్చేశారు వైసీపీ యువ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎంత సీరియస్ నెస్ క్రియేట్ చేసినా కామెడీ ఫేస్ కి ఎక్కడా సెట్ అవడం లేదు లోకేశా అంటూ తనదైన స్టైల్ లో పొలిటికల్ ర్యాగింగ్ చేశారు. కుర్చీ మడతేస్తూ అంటూ చంద్రబాబు లోకేష్ వేదికల మీద కామెడీ పండిస్తున్నారని వైసీపీ అంటోంది.

గుడివాడ అదే మాట అంటూ చంద్రబాబు కుర్చీనీ కుర్చీ 2019లోనే మడతడిపోనాది గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. నీ పార్టీని మడతేసిన తరువాత అయిదేళ్లకు గుర్తుకు వచ్చి నీ కుర్చీని నీవే మరోసారి మడతేసుకుంటున్నావా అని సెటైర్లు పేల్చారు.

నీ నాలిక మడత పడిపోయింది కూడా 2019 ఓటమితోనే ముందు నాలిక మడత తీస్తే సరిగ్గా అయినా పదాలు పలుకుదువు గానీ అని గుడివాడ ఒక రేంజిలో ఏకి పారేశారు. కుర్చీల మడతేయడం సరదా మరో రెండు నెలలలో పూర్తిగా తీరిపోతుంది అంటూ జోస్యం చెప్పారు.

జగన్ దెబ్బకు 2019లో మడత పడినవి కుర్చీలే. ఈసారి ఎన్నికల్లో మీ పార్టీ కూడా మడతడిపోద్ది అంటూ గుడివాడ లోకేష్ కి ఫ్యూచర్ పిక్చర్ ఏంటో చూపించేశారు. జస్ట్ అరవై రోజులు ఆగమ్మా అంటూ లోకేష్ కి క్లారిటీగా చెప్పారు.

జగన్ దెబ్బకి ఇప్పటికే టీడీపీ కుర్చీలు మడతేసుకున్న తరువాత ఇంకా ఏమి మిగిలింది అని ఆయన వెటకారం చేశారు. ప్రతీ మీటింగులో ఎర్ర బుక్కు చూపిస్తున్నావ్ కానీ ఇక మీదట దాన్ని మడచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని కూడా గుడివాడ లోకేష్ గాలి తీసేశారు.

గుడివాడ పంచులతో లోకేష్ శంఖారావం ఉత్సాహం అంతా నీరు కారినట్లే అంటున్నారు. ఇప్పటిదాకా సంకారావం అంటూ లోకేష్ ట్రోల్స్ కి గురి అవుతున్నారు. ఇపుడు గుడివాడ విమర్శలతో మరింతగా ట్రోల్ చేయడం ఖాయం అంటున్నారు. లోకేష్ ది కామెడీ ఫేస్ అంటూ ఆయన సీరియస్ డైలాగులు ఎన్ని పేల్చినా వైసీపీ లైట్ తీసుకుంటుందని గుడివాడ చెప్పకుండానే చెప్పేశారు.

తన టూర్లలో కదలించిన జనాల మధ్య వీరావేశం ప్రదర్శిస్తూ వస్తున్న లోకేష్ కి విశాఖలో ఎంట్రీకి ముందే గుడివాడ మాటలతో చేసిన దాడి ఒక లెవెల్ లో ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.