టీడీపీ ప్ర‌భంజ‌నం.. బోసిపోయిన వైసీపీ కార్యాల‌యం!

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దూసుకుపోతోంది. మ‌రోవైపు ఈ ఫ‌లితాల్లో వెనుకంజ‌లో ఉండ‌టంతో మంగ‌ళ‌గిరిలోని వైసీపీ కార్యాల‌యం బోసిపోయింది. కార్య‌ల‌యం ద‌గ్గ‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌ల జాడ కూడా క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతానికి టీడీపీ…

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి దూసుకుపోతోంది. మ‌రోవైపు ఈ ఫ‌లితాల్లో వెనుకంజ‌లో ఉండ‌టంతో మంగ‌ళ‌గిరిలోని వైసీపీ కార్యాల‌యం బోసిపోయింది. కార్య‌ల‌యం ద‌గ్గ‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌ల జాడ కూడా క‌నిపించ‌డం లేదు. ప్రస్తుతానికి టీడీపీ 81, జనసేన 16, బీజేపీ 5, వైసీపీ 15 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి. దీంతో కూటమి మ్యాజిక్ ఫిగర్ 88ను దాటింది. 

మ‌రోవైపు ప‌లు కౌంటింగ్ కేంద్రాల నుండి ఆ పార్టీ అభ్య‌ర్థులు ఇంటి బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య‌నేత‌లు గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ సెంటర్ల నుంచి వారు వెళ్లిపోయారు.

మ‌రోవైపు టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అలాగే జ‌న‌సేన కూడా కోస్తాతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాలోనూ గ్లాస్ గుర్తు దూసుకెళ్తోంది. మీకు మంచి జ‌రిగింటే నాకు ఓటు వేయండి అంటూ జ‌గ‌న్ అడిగిన‌ట్లే మంచి జ‌రిగిన‌వారే వైసీపీకి ఓట్లు వేసిన‌ట్లు సృష్టంగా క‌న‌ప‌డుతోంది.