వంట నూనెల స‌ల‌స‌ల‌

వంట నూనెల ధ‌ర‌లు పెరిగాయి. దీంతో వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి జీవులకు ధ‌ర‌ల పెరుగుద‌లతో గుండె ద‌డ పెరుగుతోంది. దిగుమ‌తి సుంకాన్ని కేంద్ర ప్ర‌భుత్వం…

వంట నూనెల ధ‌ర‌లు పెరిగాయి. దీంతో వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి జీవులకు ధ‌ర‌ల పెరుగుద‌లతో గుండె ద‌డ పెరుగుతోంది. దిగుమ‌తి సుంకాన్ని కేంద్ర ప్ర‌భుత్వం 20 శాతం పెంచ‌డంతో వంట‌నూనెల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి.

పామాయిల్ ధ‌ర కిలో రూ.100 నుంచి రూ.115, స‌న్‌ప్ల‌వ‌ర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశ‌న‌గ నూనె రూ.155 నుంచి రూ.165కు పెరిగింది. అలాగే పూజ‌ల్లో వినియోగించే నూనెల్ని రూ.110 నుంచి రూ.120కి పెంచ‌డం గ‌మ‌నార్హం.

ఒక్క‌సారిగా నూనెల ధ‌ర‌లు పెంచ‌డంపై వినియోగ‌దారులు మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచ‌డం ప‌క్క‌న పెట్టి, భారం వేయ‌డానికి ప్ర‌భుత్వాలు ప‌ని చేయ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

దిగుమ‌తి సుంకం పెంచ‌డంతో మ‌రిన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగే ప్ర‌మాదం వుంద‌ని వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌జ‌ల‌పై భారం వేస్తోంద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.

18 Replies to “వంట నూనెల స‌ల‌స‌ల‌”

  1. ఇలాంటి వార్తలు ను జూన్ నెల వరకు వేరే పార్టీ మీడియా గోరంత కొండంతలు చేసి చూపేది, ఇప్పుడు మీ వంతు!

    1. నూనె ధరలు భారంగా మారాయా లేదా? మీడియా కొండతలు కాదు కానీ మేమైతే ధరలు పెరిగి బాగా ఇబ్బంది పడుతున్నాం.

      1. కారణం ఏమీ లేకుండా ప్రభుత్వం ఏ పనీ చెయ్యదు.

        “After a long time, the government has been attempting to balance the interests of both consumers and farmers,” said Sandeep Bajoria, CEO of Sunvin Group, a vegetable oil brokerage.

        The move has increased the likelihood of farmers receiving the minimum support price set by the government for their soybean and rapeseed harvests, he said.

  2. గింజల నుండి వచ్చే నూనె వాడకం వల్లనే అన్ని రోగాలు వస్తున్నాయి ( ఇన్ఫ్లమేషన్) ప్రపంచ వ్యాప్తంగా న్యూట్రిషన్ సైంటిస్టు లు మొత్తుకుని చెబుతున్నారు.

    1980 ముందు మొక్కల గింజల నుండి వచ్చే నూనె లా వాడకం చాలా తక్కువగా వుండేది.

    వేపుడు అనే ఆలోచనే భారతీయ వంటలు లో లేదు.

    పద్ధతి ప్రకారం జంతువుల నుండి వచ్చిన కొవ్వు (నెయ్యి) తో సుతారంగా కాస్త పై పై న తాలింపు చేయడం మాత్రమే భారతీయ వంట పద్దతి.

    ఇప్పుడేమో ప్రతి దాన్ని కేజీలు కేజీలు నూనె లో మరగింగిచి ఫ్రై చేయటం అలవాటు అయింది. ఈ రిఫైనెడ్ ఆయిల్ అనే వ్యాపార ము మొదలు పెట్టిన తర్వాత.

    1. బిర్యానీ గతం లో ఎపుడో సంవత్సరంలో ఒకటో రెండు సార్లో తినేవాళ్ళు, ఊరూ మొత్తం వేట నీ కోసుకుని.

      ఇప్పుడు ప్రతి పూట తినడము అలవాటై అయింది , హోం డెలివరీ వ్యాపారం వచ్చిన తర్వాత.

    2. డబ్బు వున్న వాళ్ళకి

      నెయ్యి, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె,

      డబ్బు లేక పోతే

      వేరు శెనగ నూనె

      పొరపాటున కూడా రిఫైన్డ్ o

  3. ఆంటే దీని అర్థం, పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పండించే పేద రైతులు కి

    ఇప్పుడు ఎక్కవ ఆదాయం , డబ్బు వస్తది అనేనా.

  4. బియ్యం కూడా కేజీ వంద రూపాయల చెయ్యాలి.

    లాగైనా రెట్లు పెరిగి జనాలు బియ్యం బదులు మిగతా పాత కాలం లో వాడే జొన్న, రాగులు, అరికెలి లాంటివి తినడం మొదలు పెడతారు.

    ఎప్పుడైనా షుగర్, అధికా బరువు జబ్బు లు తగ్గి జనాలు కాస్త ఆరోగ్యం గా తయారు అవుతారు.

    లేకపోతే ఆ వరి ఆన్న ము గంజి వార్చ కుండా నేరుగా కుక్కర్ లో పెట్టీ, నేరుగా ఆ ఫుడ్ బాం*బ్ నీ రోజు పొట్టలో కి తోస్తున్నారు.

Comments are closed.