అత‌ను జామాతా దశమగ్రహం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌ల్లో వ‌రుస మ‌ర‌ణాలు చోటు చేసుకోవ‌డంపై ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని చంద్ర‌బాబు అని వైసీపీ నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవాళ మాజీ మంత్రి…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌ల్లో వ‌రుస మ‌ర‌ణాలు చోటు చేసుకోవ‌డంపై ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగిపోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని చంద్ర‌బాబు అని వైసీపీ నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవాళ మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. య‌మ‌ర‌థంతో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలిగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అని తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. శని గ్రహాన్ని మించిన, జామాతా దశమగ్రహం చంద్రబాబు అని ఆయ‌న అభివ‌ర్ణించారు. కేవ‌లం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే అమాయకుల ప్రాణాలు తీసింద‌న్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మొదలు, చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్ధున్న వాళ్ళు ఎవరూ వెళ్లరన్నారు.  ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు స్వయంగా  గెలవడం కల అని కొడాలి నాని జోస్యం చెప్పారు.  

రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగల్ గానే పోటీ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ త‌మ‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంశాల వారీగానే జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామే తప్ప, వైసీపీకి ఎవరితో పొత్తులు ఉండవ‌ని నాని తేల్చి చెప్పారు.