ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్టీఆర్ జీవన చరమాంకలో చంద్రబాబు నేతృత్వంలో ఎలాంటి దుస్థితి పట్టించారో అందరికీ తెలుసు. వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన వైనాన్ని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామ అని కూడా ఎన్టీఆర్ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారని సొంత వాళ్లు కూడా కాదనలేని వాస్తవం.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చంద్రబాబు చేతల మీదుగా జరగడం గమనార్హం. ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి దూసుకొస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్తో పాటు చంద్రబాబును తమిళ సూపర్స్టార్ ఆకాశమే హద్దుగా పొగడడంపై ప్రత్యర్థులు ఫైర్ అవుతున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్ ఏ మాత్రం సిగ్గూశరం లేకుండా చంద్రబాబునాయుడిని పొగుడుతున్నారని మండిపడ్డారు. 1995లో వైశ్రాయ్ హెటల్ ఎదుట ఎన్టీఆర్పై చంద్రబాబు చెప్పులు విసిరిస్తే, దానికి రజినీకాంత్ మద్దతు పలికారని విమర్శించారు.
ఎన్టీఆర్ను అవమానించేందుకు మద్దతు ఇచ్చిన రజినీకాంత్ నేడు ఆయన గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుందన్నారు. వెధవలంతా ఒకచోట చేరి ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని కొడాలి నాని విరుచుకపడ్డారు.
ఎన్టీఆర్ జీవించిన రోజుల్లో రజినీకాంత్ ఏం చేశాడని ఆయన నిలదీశారు. ఇప్పుడు రజినీకాంత్ మాట్లాడ్డానికి కారణం ఏంటని కొడాలి ప్రశ్నించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను రజినీ చదువుతూ.. మరింత దిగజారిపోతున్నాడని కొడాలి ఆగ్రహించారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజినీని ఆహ్వానించడం వెనుక కథ వేరే ఉందన్నారు. కేవలం పవన్కల్యాణ్ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీని చంద్రబాబు రంగంలోకి దింపారని కొడాలి సంచలన కామెంట్స్ చేయడం గమనార్హం.