అశోక్ ని ఓటమే పలకరిస్తుందట

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి పలకరిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే, ఆయన ప్రత్యర్ధి అయిన కోలగట్ల వీరభద్రస్వామి జోస్యం చెప్పారు.  ఆయన తన మీద పోటీ…

విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి పలకరిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే, ఆయన ప్రత్యర్ధి అయిన కోలగట్ల వీరభద్రస్వామి జోస్యం చెప్పారు.  ఆయన తన మీద పోటీ చేసినా 2024 లో గెలిచేది తానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అశోక్ గజపతిరాజు ఎపుడూ కోటలోనే ఉంటారని, తాను ప్రజలలోనే ఉంటాను అని తేడా చెప్పారు. అశోక్ కోటను విడిచి జనంలోకి వచ్చి ప్రచారం చేసిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ వైసీపీయే గెలిచిందని ఆయన గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే అశోక్ బయటకు వస్తారని మిగిలిన టైం లో ఆయన కనిపించరని కోలగట్ల పెద్ద విమర్శే చేశారు.

తాను నిరంతరం ప్రజలలోనే ఉంటూ వారి సమస్యలను చూస్తున్నాను అని ఆయన అంటున్నారు. జనంలో ఉండేవారికే ఎవరైనా గెలిపిస్తారు తప్ప ఎపుడో ఒకసారి కనిపించే వారికి పట్టం కట్టరు కదా అని ఆయన అంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి గెలిచిన కోలగట్ల 2024లో మరోసారి గెలవడానికి చూస్తున్నారు. 

ఈసారి అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా పోటీకి దిగితారని వార్తలు వస్తున్నాయి. తన ప్రత్యర్ధి మీద మళ్ళీ నేనే గెలిచేది అంటూ ముందుగానే విజయనగరం అసెంబ్లీ జాతకాన్ని కోలగట్ల చెప్పారు. అశోక్ గజపతిరాజు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటికి రెండు సార్లు ఓడారు. మూడవసారి కూడా ఆయన ఓడుతారా కోలగట్ల జోస్యం నిజమవుతుందా అన్నది 2024లో తేలే మ్యాటర్.