ముచ్చటగా మూడోసారి.. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ!

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇరువురి నాయకుల మధ్య పొత్తుల‌తో పాటు ఏపీ…

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇరువురి నాయకుల మధ్య పొత్తుల‌తో పాటు ఏపీ రాజకీయాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

గ‌తంలో ఇరువురు నాయ‌కులు ఒకరికి ఒకరు పరామర్శల పేరుతో క‌లుసుకున్నా తాజాగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ స్వ‌యంగా చంద్ర‌బాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు త‌ప్ప‌కుండా ఉండ‌బోతున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌న వేస్తున్నారు. మరి బీజేపీతో కలిసి వెళ్తాయా లేక రెండు పార్టీలే పొత్తుకు వెళ్తాయా అనేది తెలియ‌ల్సిఉంది. 

కొన్ని రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను క‌లిసిన‌ త‌ర్వాత ప‌వ‌న్- బాబు భేటీ అవ్వ‌డం విశేషం. కాగా నారా లోకేష్ పాద‌యాత్ర‌కు అటంకం క‌ల‌గ‌కుండా ఎంతో ఇష్ట‌ప‌డి సిద్దం చేసుకున్న వారాహి బ‌స్సు యాత్రను ప‌వ‌న్ వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.