ప‌వ‌న్‌కు అదో తుత్తి!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ చేస్తే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అదే తుత్తి అన్న‌మాట‌. షూటింగ్‌ల్లో ఆయ‌న బిజీగా ఉన్నారు కాబోలు…. వీకెండ్స్ ప‌ర్య‌ట‌న‌ల‌కు స‌మ‌యం దొర‌క‌న‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల్లో తానున్నాన‌ని త‌న పార్టీ శ్రేణుల‌కి…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ చేస్తే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అదే తుత్తి అన్న‌మాట‌. షూటింగ్‌ల్లో ఆయ‌న బిజీగా ఉన్నారు కాబోలు…. వీకెండ్స్ ప‌ర్య‌ట‌న‌ల‌కు స‌మ‌యం దొర‌క‌న‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల్లో తానున్నాన‌ని త‌న పార్టీ శ్రేణుల‌కి గుర్తు చేసేందుకు ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలిచేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తుంటారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేస్తే ఎల్లో మీడియా వాటికి ప్రాధాన్యం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంటుంద‌నే కిటుకు కనుక్కున్నారు.

తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ఓ జాతీయ అవార్డును ఇస్తూ… వ్యంగ్య ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

‘అప్పులతో ‘ఆంధ్ర (Andhra)’ పేరు మారుమోగిస్తున్నందుకు, ముఖ్య‌మంత్రికి నా ప్రత్యేక శుభకాంక్షలు .. keep it up. మీ వ్యక్తిగత సంపదను పెంచుకోడాన్ని మర్చిపోవద్దు. రాష్ట్ర సంపద, ప్రగతి ‘కుక్కల’కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా’ అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న మార్క్ అక్క‌సును వెళ్ల‌గ‌క్కుతూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.  

ఈ ట్వీట్‌లో జ‌గ‌న్‌కు అవార్డు ఇస్తున్న‌ట్టు ఓ వ్యంగ్య ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో భార‌త‌ర‌త్న లాగా ఇది కూడా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డట, సార్ అని జ‌గ‌న్‌కు ఓ అధికారి చెబుతున్న‌ట్టుంది. ఏదో ఒక‌టి జ‌గ‌న్‌ను విమ‌ర్శించాల‌నే ఆలోచ‌న ఈ ట్వీట్ ప్ర‌తిబింబించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

కొత్త‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అప్పులు చేయ‌డం లేదు. తాను పొత్తు కుదుర్చుకున్న మోదీ స‌ర్కార్ అప్పుల గురించి కూడా ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ చెబితే బాగుంటుంది. ఇదిలా వుండ‌గా ప‌వ‌న్‌ ట్వీట్‌పై కౌంట‌ర్ ఎలా వుంటుందో చూడాలి.