హీరోయిజం నుంచి జీరోయిజానికి…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అతిపెద్ద అభిమాని ఎవ‌రంటే… ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాను నిశితంగా ప‌రిశీలిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స్పంద‌న‌ను వ‌ర్మ తెలియ‌జేస్తుంటారు. ఈ స్పంద‌న ఎక్కువ‌సార్లు జ‌న‌సేన…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అతిపెద్ద అభిమాని ఎవ‌రంటే… ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాను నిశితంగా ప‌రిశీలిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న స్పంద‌న‌ను వ‌ర్మ తెలియ‌జేస్తుంటారు. ఈ స్పంద‌న ఎక్కువ‌సార్లు జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పోపం తెప్పిస్తూ వుంటుంది. వ‌ర్మ స్పంద‌న ఘాటుగా వుండ‌డ‌మే ఇందుకు కార‌ణం.

తాజాగా ప‌వ‌న్‌పై ట్విట‌ర్ వేదిక‌గా ఆర్జీవీ త‌న మార్క్ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర‌ను ప్రాంభించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సీఎంగా ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప‌వ‌న్ అభ్య‌ర్థిస్తుండ‌డంపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు.

“పవర్ స్టార్ కన్నీళ్ల‌తో ఒక్క అవ‌కాశం అంటూ అడుక్కుంటున్నారు. అభిమానులు, కులస్తుల‌ దృష్టిలో ఆయన హీరోయిజం జీరోయిజానికి ప‌డిపోతోంది” అని వ‌ర్మ ట్వీట్ చేశారు. రాజ‌కీయాల్లో స్థిర‌త్వం లేని ప్ర‌క‌ట‌న‌ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభాసుపాల‌వుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీల‌నివ్వ‌న‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకుంటాన‌ని, అలాగే త‌న‌కు సీఎం ప‌ద‌విని చంద్ర‌బాబు ఎందుకిస్తార‌ని ఇలా నోటికొచ్చిన‌ట్టు వివిధ సంద‌ర్భాల్లో మాట్లాడారు. ఈ మాట‌లే నేడు ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధంగా మారాయి.

వారాహి యాత్ర మొద‌లు పెట్టిన నేప‌థ్యంలో ఒక్క‌సారి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌వ‌న్ కోర‌డంపై రాజ‌కీయంగా భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పొత్తుల ఊసే ఎత్త‌క‌పోవ‌డంపై టీడీపీ, బీజేపీ ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. చివ‌రి నిమిషంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ యూట‌ర్న్ తీసుకుని త‌మ‌ను న‌ట్టేట ముంచుతాడేమో అన్న భ‌యం టీడీపీని వెంటాడుతోంది. 

జ‌న‌సేన‌కు 20 లోపు అసెంబ్లీ సీట్లు ఇచ్చి, అత్య‌ధిక ల‌బ్ధి పొందేందుకు టీడీపీ వ్యూహ ర‌చ‌న చేసింది. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌స్తుత వైఖ‌రి చూస్తుంటే ఏదో తేడా కొడుతోంద‌ని అనుమానిస్తోంది. ఈ కోణంలో ఆర్జీవీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.