గృహిణి లేకుండానే ప‌వ‌న్ గృహ ప్ర‌వేశం

కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఇంటివాడ‌య్యారు. ఇవాళ క్రోధి నామ తెలుగు సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని చేబ్రోలులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గృహ ప్ర‌వేశం చేయ‌డం…

కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్ట‌కేల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఇంటివాడ‌య్యారు. ఇవాళ క్రోధి నామ తెలుగు సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని చేబ్రోలులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గృహ ప్ర‌వేశం చేయ‌డం విశేషం. స‌హ‌జంగా గృహ ప్ర‌వేశం అంటే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ పాల్గొంటుంటారు.

మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన తాజా మాజీ నేత పోతిని మ‌హేశ్ సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ త‌న కోరిక‌ను బ‌య‌ట పెట్టిన సంగ‌తి తెలిసిందే. పిఠాపురంలో గృహ ప్ర‌వేశం చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న భార్య  అన్నా లెజినోవాతో క‌లిసి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ఆకాంక్షించారు. దీంతో ప‌వ‌న్ గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మంలో అన్నా లెజినోవా పాల్గొనడంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది.

ఏది ఏమైతేనేం, పోతిన మ‌హేశ్ ఆకాంక్షను ప‌వ‌న్ నెర‌వేర్చ‌లేదు. గృహిణితో సంబంధం లేకుండానే ప‌వ‌న్ ఉగాది ప‌ర్వ‌దినాన గృహ ప్ర‌వేశం చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక్క‌డిగానే పూజ‌లు చేశారు. అనంత‌రం ఉగాది వేడుక‌ల‌ను అక్క‌డే నిర్వ‌హించారు. వేద పండితులు పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో  పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ‌, బీజేపీ ఇన్‌చార్జ్ కృష్ణంరాజు, కాకినాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి తంగెళ్ల ఉద‌య్ శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.