ప్రతి నెగెటివిటీని వైసీపీ ప్రభుత్వానికి ముడిపెట్టడం అలవాటుగా మారింది. నిజాలతో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా ఎల్లో గ్యాంగ్ కుట్రలకు తెరలేపింది. రెండు రోజుల క్రితం మంత్రి కారమూరి నాగేశ్వరరావు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారనే అబద్ధాన్ని ఎలా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. తాజాగా వైసీపీ సర్పంచ్ బాదం ధనలక్ష్మి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని టీడీపీ తనదైన నినాదాన్ని ఎత్తుకుంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎల్లో గ్యాంగ్పై నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ సర్పంచ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అయితే, నందమూరి తారకరత్న గుండెపోటుతో మృతి చెందడం లోకేశ్ హత్యే అని ఘాటు కామెంట్స్ చేయడం గమనార్హం. యువగళం పేరుతో కుప్పంలో లోకేశ్ పాదయాత్రను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర మొదటి రోజే తారకరత్న గుండె పోటుకు గురై శివరాత్రి రోజు తుదిశ్వాస విడిచారు. తండ్రీకొడుకుల కార్యక్రమాల్లో పలువురు మృత్యువాడ పడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
తండ్రీకొడుకులు ఎక్కడ పాదం పెడితే అక్కడ శవాలు లేవాల్సిందే అనే ఆవేదనతో కూడిన కామెంట్స్ వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో ఎవరైనా అనారోగ్యంతో మృతి చెందితే, దానికి జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయంతో ముడిపెట్టడం ఎల్లో మీడియాకు, టీడీపీకి అలవాటైంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన స్టైల్లో చురకలు అంటిస్తున్నారు.
ఈనాడులో ఏదైనా రాస్తే, ఈటీవీలో ఏదైనా ప్రసారం అయితే…అది రామోజీ పనే, అలాగే తోక పత్రికలోనూ, చానల్లోనూ ఏ వార్త వచ్చినా దానికి చంద్రబాబు భక్తుడైన జర్నలిస్ట్ & యజమానిదే బాధ్యత అంటూ నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. పచ్చదళం చేసే ప్రతి కుట్రకు ప్రత్యామ్నాయ మీడియా దీటైన కౌంటర్లు ఇస్తోంది. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అల్లాడిపోతున్నారు.