టీడీపీ జనసేన మీటింగులో రచ్చ

టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులలో కొంత రచ్చ అక్కడకక్కడ సాగుతోంది. అనకాపల్లిలో బుధవారం జరిగిన టీడీపీ జనసేన సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. టీడీపీ అనకాపల్లి ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన…

టీడీపీ జనసేన కో ఆర్డినేషన్ మీటింగులలో కొంత రచ్చ అక్కడకక్కడ సాగుతోంది. అనకాపల్లిలో బుధవారం జరిగిన టీడీపీ జనసేన సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. టీడీపీ అనకాపల్లి ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావుల ఆద్వర్యంలో మీటింగ్ జరిగింది.

ఈ మీటింగ్‌లో జనసేన నేతలు పరుచూరికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కొందరు నేతలు ముందుకు రావడమే కాకుండా పరుచూరి తీరుని తప్పుపట్టారు.  ఈ క్రమంలో గందరగోళం ఏర్పడింది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారు తెలియక ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్యన జరిగిన వాగ్వాదంతో కో ఆర్డినేషన్ మీటింగ్ లో రచ్చ ఏర్పడింది.

ఎట్టకేలకు ఇరు వర్గాలని శాంతింపచేయడంతో వ్యవహారం తాత్కాలికంగా ఒక కొలిక్కి వచ్చింది. ఈ కో ఆర్డినేషన్ మీటింగు ద్వారా జనసేనలో రెండు వర్గాలు బయటపడ్డాయి. తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం వర్గ పోరు ఉంది. కో ఆర్డినేషన్ మీటింగ్ అంటున్నా అదే కొరవడుతోంది అని నేతలు అంటున్న పరిస్థితి ఉంది.