గడప గడపకు అలా బ్రేకేసిన మావోలు…?

వైసీపీ నాయాకత్వాన గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని జనాల్లొకి వెళ్తున్నారు. ఇక విశాఖ ఏజెన్సీలో చూస్తే…

వైసీపీ నాయాకత్వాన గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున సాగుతోంది. అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకుని జనాల్లొకి వెళ్తున్నారు. ఇక విశాఖ ఏజెన్సీలో చూస్తే పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గడప గడపా తొక్కుతున్నారు.

అయితే అనుకోని అవాంతరం ఈ ప్రొగ్రాం కి ఎదురైంది. అదేంటి అంటే మావోలు అమరవీరుల సంస్మరణార్ధం వారం రోజుల పాటు ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

దీంతో మావోల ప్రభావిత గ్రామాలు విశాఖ ఏజెన్సీలో చాలా ఉండడంతో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఈ వారం రోజుల పాటు గడపగడపకు బ్రేక్ ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు.  

మరో వైపు పోలీసులు కూడా ఈ వారోత్సవాల నేపధ్యంలో ఏజెన్సీ అంతా కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. మావోల మీటింగ్స్ నేపధ్యంలో అరకు ఎమ్మెల్యే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పోలీసులు సైతం ప్రజా ప్రతినిధులకు, జనాలకు కూడా భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేశారని అంటున్నారు.