ఉత్తరాంధ్రాకే ఫైర్ బ్రాండ్… తగ్గేదే లే

ఆమె ఆ మధ్య దాకా సైలెంట్ గా ఉండేవారు. పార్టీలో చాలా కాలంగా ఉన్నా కూడా పెద్దగా ఫోకస్ అయ్యేవారు కాదు. కానీ ఎపుడైతే జగన్ ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారో నాటి నుంచి…

ఆమె ఆ మధ్య దాకా సైలెంట్ గా ఉండేవారు. పార్టీలో చాలా కాలంగా ఉన్నా కూడా పెద్దగా ఫోకస్ అయ్యేవారు కాదు. కానీ ఎపుడైతే జగన్ ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారో నాటి నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. ఇక ఇటీవల కాలంలో చూస్తే జగన్ని కానీ ఆయన కుటుంబం మీద కానీ ప్రత్యర్ధి పార్టీలు ఒక్క ముక్క మాట్లాడినా ఆమె వెంటనే మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. అలా ఉత్తరాంధ్రాకే సరికొత్త ఫైర్ బ్రాండ్ గా మారిన ఆమె ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

పుట్టిల్లు శ్రీకాకుళం అయితే అత్తిల్లు విశాఖ జిల్లా. ఇక ఆమె రాజకీయ ప్రస్థానానికి కూడా ఈ ప్రాంతం సరైనదే అని భావిస్తున్నారు. బలమైన సామాజిక నేపధ్యం ఉన్న కళ్యాణి మాట్లాడితే చాలు మంటలు పెట్టేస్తున్నారు. టీడీపీ వారు తట్టుకోలేరు అన్న రేంజిలో ఆమె మాటల తూటాలు పేలుస్తున్నారు. అయినా తగ్గేదే లే అని దూసుకొస్తున్నారు.

నారా కుటుంబం కాదు సారా కుటుంబం అనడానికి ఎంత ఫైర్ ఉండాలి. చంద్రబాబు హయాంలో అతి పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఆమె అంటున్నారు. నాడు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగితే దాని వెనక బాబు ఫ్యామిలీ ఉంది అంటున్నారు. దీని మీద న్యాయ విచారణ జరగాలని కూడా వరుదు కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు.

తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని మా నాయకుడి కుటుంబం మీద విమర్శలు చేస్తారా అని ఆమె మండిపడుతున్నారు. మా జగనన్న జోలికి వచ్చారో ఖబడ్దార్, మా భారతమ్మ గురించి ఒక్క ముక్క మాట్లాడారో ఇక లెక్క తేల్చేస్తామంతే అంటూ కళ్యాణ్ కళ్ళెర్రచేస్తున్నారు. 

ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక మీదట మరో ఎత్తు అన్నట్లుగా ఆమె చేస్తున్న ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ వైసీపీకి అయితే ఖుషీగానే ఉంది. అదే టైమ్ లో టీడీపీలో ఉన్న విశాఖ ఫైర్ బ్రాండ్స్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.