వంగవీటి రాధాకు జ‌న‌సేన‌తో ముడి!

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా త‌న‌యుడు రాధా పెళ్లి వార్త కాస్త రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై చ‌ర్చ‌కు తెర‌లేపింది. న‌ర‌సాపురానికి చెందిన రాజ‌కీయ కుటుంబానికి రాధా అల్లుడు కానున్నారు. వంగ‌వీటి రాధా కాబోయే అత్త 1987లో న‌ర‌సాపురం…

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా త‌న‌యుడు రాధా పెళ్లి వార్త కాస్త రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై చ‌ర్చ‌కు తెర‌లేపింది. న‌ర‌సాపురానికి చెందిన రాజ‌కీయ కుటుంబానికి రాధా అల్లుడు కానున్నారు. వంగ‌వీటి రాధా కాబోయే అత్త 1987లో న‌ర‌సాపురం మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గా టీడీపీ త‌ర‌పున ప‌ని చేశారు.

న‌ర‌సాపురానికి చెందిన జ‌క్కం బాబ్జి, అమ్మాని దంప‌తుల రెండో కుమార్తె పుష్ప‌వ‌ల్లిని రాధా మ‌నువాడ‌నున్నారు. గ‌తంలో బాబ్జి కుటుంబం టీడీపీలో క్రియాశీల‌కంగా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చారు. ఇటీవ‌ల మళ్లీ న‌ర‌సాపురానికి వ‌చ్చారు. ప్ర‌

స్తుతం బాబ్జి కుటుంబం జ‌న‌సేన‌లో క్రియాశీల‌కంగా ప‌ని చేస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర‌లో భాగంగా ఈయ‌న ఇంట్లోనే జ‌న‌సేనాని బ‌స చేశారు. ఆ మ‌ధ్య‌ వంగవీటి రంగా జయంతి సందర్భంగా వంగవీటి రాధా కూడా వీరి నివాసానికి వెళ్లారు. అప్పుడే పెళ్లి చ‌ర్చ‌ల‌కు బీజం ప‌డిన‌ట్టు స‌మాచారం. 

మ‌రోవైపు రాధా అధికారికంగా టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ, జ‌న‌సేన‌తో క‌లిసి తిరుగుతున్నారు. మ‌రోవైపు కాబోయే మామ‌గారి కుటుంబం రాజ‌కీయంగా జ‌నసేన‌తో ఉండ‌డంతో ఆ పార్టీతో బంధాన్ని మ‌రింత బ‌లంగా ముడి వేసే అవ‌కాశాలున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.