బాబుతో విజ‌య‌సాయికి ద‌గ్గ‌రి బంధుత్వం!

బంధువుల కంపెనీల‌న్నీ త‌న‌వే అని చెబుతుండ‌డంపై వైఎస్సార్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  Advertisement ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో త‌న‌కు ద‌గ్గ‌రి బంధుత్వ‌మ‌ని సంచ‌ల‌న…

బంధువుల కంపెనీల‌న్నీ త‌న‌వే అని చెబుతుండ‌డంపై వైఎస్సార్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో త‌న‌కు ద‌గ్గ‌రి బంధుత్వ‌మ‌ని సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. చంద్ర‌బాబు త‌న‌కు వ‌రుస‌కు ఏమ‌వుతారు, బంధుత్వం ఎలా ఏర్ప‌డింద‌నే విష‌యాల్ని ఆయ‌న వివ‌రించ‌డం విశేషం.

బంధువుల కంపెనీల‌న్నీ త‌న‌వే అని టీడీపీ ఆరోపిస్తోంద‌ని, ఆ లెక్క‌న చంద్ర‌బాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా త‌న‌దే అని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఎందుకంటే చంద్ర‌బాబునాయుడు త‌న‌కు ద‌గ్గ‌రి బంధువు అవుతార‌న్నారు. ఈ విష‌యం మీకు తెలుసో లేదో అని అన్నారు. 

నిజంగా కూడా త‌న‌కు చంద్ర‌బాబునాయుడు బంధువు అని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌న‌కు చంద్ర‌బాబు అన్న‌య్య అవుతార‌ని విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

ఎలాగ‌ని కూడా చెబుతా అంటూ వివ‌రించారు. దివంగ‌త ఎన్టీఆర్ మ‌నుమ‌డైన‌ తార‌క‌ర‌త్న త‌న భార్య‌ సోద‌రి కూతురిని పెళ్లి చేసుకున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. అంటే చంద్ర‌బాబు త‌న‌కు అన్న‌య్య అవుతార‌న్నారు. బంధువు కావ‌డం వ‌ల్ల త‌న ఆస్తుల‌న్నీ చంద్ర‌బాబుకో, లేక ఆయ‌న ఆస్తులు త‌న‌వి అయిపోతాయా? అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

బంధువులు అయినంత మాత్రాన హెరిటేజ్‌, అరబిందో ఒక‌టై పోతాయా? అని నిల‌దీశారు. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు తర్కం లేకుండా ఏదో ర‌కంగా బుర‌ద చ‌ల్లాల‌నే త‌ప‌న ఎక్కువైంద‌ని మండిప‌డ్డారు. 

చంద్ర‌బాబుకు ఏ కోశాన తెలివి అనేది లేద‌ని విజ‌య‌సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ చేశారు. చంద్ర‌బాబుపై నిత్యం విమ‌ర్శ‌లు చేసే విజ‌య‌సాయి…. ఒక్క‌సారిగా ఆయ‌న అన్న అవుతార‌ని చెప్ప‌డం రాజ‌కీయంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

ఇంత‌కాలం అన్న బాబు, త‌న‌యుడితో స‌మాన‌మైన లోకేశ్‌పై విజ‌య‌సాయి విమ‌ర్శ‌లు చేశారా? అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.