ఔన్లే …విప్ప‌డానికి బ‌ట్ట‌లు కూడా లేవు క‌దా!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పేరుకే జాతీయ అధికార పార్టీలో ఉన్నారు. ఆయ‌న మ‌న‌సు మాత్రం టీడీపీతో ఉంది. త్వ‌ర‌లో టీడీపీలో చేరే నాయ‌కుల్లో ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో…

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పేరుకే జాతీయ అధికార పార్టీలో ఉన్నారు. ఆయ‌న మ‌న‌సు మాత్రం టీడీపీతో ఉంది. త్వ‌ర‌లో టీడీపీలో చేరే నాయ‌కుల్లో ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో వుంటూ టీడీపీ వాయిస్‌ని బ‌లంగా వినిపిస్తుంటారు. తాజాగా మంత్రి ఆదిమూల‌పు సురేష్‌పై ఆయ‌న సెటైర్ విసిరారు. అస‌లే ఏపీలో ఏమీలేని పార్టీ త‌ర‌పున మాట్లాడుతున్న ఆయ‌న్ను నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరే క్ర‌మంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్ తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ… టీ ష‌ర్ట్‌ను విప్పి అర్ధ‌న‌గ్నంగా నిలిచి రా తేల్చుకుందామ‌న్నారు. ఆదిమూల‌పు సురేష్ వైఖ‌రిపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

“మీరు బ‌ట్ట‌లు విప్ప‌డం కాదు. 2024లో ప్ర‌జ‌లే మీ బ‌ట్ట‌లు విప్పే ప‌రిస్థితి వ‌స్తుంది” అని ఆయ‌న ఘాటు హెచ్చ‌రిక చేశారు. మంత్రి హోదాలో బ‌ట్ట‌లు విప్ప‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 2024లో వంద‌శాతం వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. సీఎం జ‌గ‌న్ మెప్పుకోస‌మే మంత్రులు ఇలా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. విష్ణుకుమార్‌రాజు వైఖ‌రిపై సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు సృజ‌నాత్మ‌క విమ‌ర్శ‌ల‌కు దిగారు.

ఇంకా చంద్ర‌బాబు బాస్ కాలేద‌ని, అప్పుడే రోషం పొడుచుకొస్తోంద‌ని నెటిజ‌న్లు చుర‌క‌లు అంటించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మరికి బట్ట‌లే లేవ‌ని, ముందు ఆ చేదు నిజాన్ని గ్ర‌హించి, ఇత‌రుల గురించి మాట్లాడండి రాజు గారూ అని దెప్పిపొడిచారు. చంద్ర‌బాబు కోసం ఇంత‌గా బ‌ట్ట‌లిప్పి వెన‌కేసుకు రావాలా మీసాల రాజు అని మ‌రికొంద‌రు వెట‌క‌రించారు.