ఈ నియోజ‌కవ‌ర్గంలో వైసీపీ అనాథ‌!

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అనాథ అయ్యింది.

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అనాథ అయ్యింది. మ‌రోవైపు అధికార పార్టీ నాయ‌కులు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లపై భౌతిక‌దాడులు, ఆస్తుల విధ్వంసానికి తెగ‌బ‌డుతూనే ఉన్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లోనే విరివిగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కూట‌మి ఎమ్మెల్యేపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోడానికి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి నాయ‌క‌త్వం కొర‌వ‌డ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

గ‌త ఐదేళ్లు బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు అధికారాన్ని అనుభ‌వించారు. వైసీపీ ఓడిపోయిన త‌ర్వాత బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆచూకీ క‌రువైంది. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్ట‌మొస్తే, ఎవ‌రి ద‌గ్గ‌రికెళ్లాలో అర్థంకాని అయోమ‌య స్థితి నెల‌కుంది. బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి స్థానికంగా ఉండ‌డం లేదు.

త‌న‌ను ఓడించార‌నే ప్ర‌జ‌ల‌పై ఆయ‌న కోపం పెంచుకున్న‌ట్టుంది. అందుకే ఆయ‌న ఎవ‌రికీ క‌నిపించ‌కుండా, ఎక్క‌డున్నారో తెలియ‌కుండా అజ్ఞాత జీవితం గ‌డుపుతున్నారు. బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నార‌నే చ‌ర్చ కూడా లేక‌పోలేదు. కొత్త నాయ‌క‌త్వాన్ని వైసీపీ అధిష్టానం అన్వేషించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా శ్రీ‌కాళ‌హ‌స్తి మండ‌లం ఇన‌గ‌లూరులో వైసీపీ నాయ‌కుడు, స‌ర్పంచ్ చెలికం నాగ‌రాజురెడ్డికి చెందిన 100 ట‌న్నుల టేకును దుండ‌గులు ద‌గ్ధం చేశారు. సుమారు రూ.10 ల‌క్ష‌ల ఆస్తి న‌ష్టం వాటిల్లింది. బాధితుడిని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప‌రామ‌ర్శించి ఓదార్చారు. అలాగే కూట‌మి నేత‌ల అరాచ‌కాల‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణం స్పందించాల్సిన బియ్య‌పు మధు ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

వైసీపీలో తాను లేన‌ని బియ్య‌పు మ‌ధు ప్ర‌క‌టించ‌డ‌మో, లేక ఆ విష‌యాన్ని ఆ పార్టీ అధిష్టాన‌మే తేల్చి చెప్ప‌డ‌మో చేయాల్సిన ప‌రిస్థితి. ఇక‌పై ఇదిగో ఈయ‌నే నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తే, శ్రీ‌కాళ‌హ‌స్తిలో పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంది. లేదంటే వైసీపీ శ్రేణులు ప్ర‌త్యామ్నాయం చూసుకోవాల్సి వుంటుంద‌ని నాయ‌కులు అంటున్నారు. ప‌ద‌వులు, అధికారం అనుభ‌వించ‌డానికే అయితే, ఇక అలాంటి వాళ్ల‌ను నాయ‌కుల‌ని ఎలా భావిస్తామ‌ని శ్రీ‌కాళ‌హ‌స్తి వైసీపీ కార్య‌క‌ర్త‌ల ప్ర‌శ్న ఆలోచింప‌జేసేలా వుంది. ఈ విష‌య‌మై వైసీపీ అధిష్టానం ఎలా ఆలోచిస్తుంద‌నే దాన్ని బ‌ట్టి, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి వుంటుంది.

16 Replies to “ఈ నియోజ‌కవ‌ర్గంలో వైసీపీ అనాథ‌!”

  1. అక్కడ బియ్యం గాడు తప్పితే.. వైసీపీ కి నాయకుడు లేరు..

    అందుకే మూసుకుని ఉన్నారు..

    కనీసం 100 నియోగాజకవర్గాల్లో వైసీపీ కి నాయకులు లేరు.. ఇకపై వెతుక్కోవాలి.. అడుక్కోవాలి..

    1. Boss, TDP ki 2024 lo election varaku kuda candidates leru konni daggara , appati YCP vallani cheruchukunedaka. If people got frustrated with government you will also win as MlA/MP If you contest from oopstion party

      1. You must know one thing, during 2019-24 , YCP govt arrested TDP leaders multiple times. But no TDP leader left the constituency. Atchem Naidu, Ayyanapatrudu, Anitha, Dhulipalla Narendra, Kollu Ravindra, Diwakar Reddy family, Pull Rao family etc got witch hunted, but they remain always with the constituency 

      2. అంటే జగన్ రెడ్డి పాలన అంత దరిద్రం గా ఉండిందన్నమాట..

        ఆ అసలు నిజం నొక్కేసి.. మాకు 175 కి 175 వస్తాయి..

        హామీలు 99% నెరవేర్చేశాము..

        సిద్ధం సభలకు పోటెత్తిన జనం..

        సాక్షి లో అయితే జగన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు..

        ..

        ఫలితాలు వచ్చాక ఈవీఎం స్కాం అని ఏడుపు..

        ఎందుకు ఇన్ని అబద్ధాలు..

        అసలు నిజం నువ్వు రాసిన విషయం.. ఇప్పుడైనా మీ జగన్ రెడ్డి కి తెలుసా..

        అస్సలు తెలీదు.. నువ్వెళ్ళి చెప్పు.. వింటాడేమో..

        1. Boss, mana rajakeyalu meku kottaga cheppalisina paristhi ledu Anukunta, Mana rajakeyalo kula prabhavam plus village leaders prabavam akkuva unetadi,villages  Anedaru oka party ki appudu unedaru. Kani jagan emi chesrau present government laga kakunda anedarani equal anukunnadu and he doesn’t care about villages party leaders and other leaders as well. Mana sangathi telusu present unna TDP vallu emi cheyakapoyina vote vese vallu unnaru alage same like YCP ki kuda. Jagan tried different formula. He never expected adi boomwrong avutundi ani. Only 10 percent people are king makers. Ineka akkuva cheppalisina pani ledu Anukunta. Even CBN also told EVM’s on 2019 time .

          1. దాన్నే రాజకీయం అంటారు..

            చంద్రబాబు ఒక్కసారి అనేసి ఊరుకుండిపోయాడు.. మీ జగన్ రెడ్డి పదే పదే ఈవీఎంల మీద పడి ఏడ్చాడు.. కమెడియన్ అయిపోయాడు..

          2. Jagan Reddy emi na banduvu kadu, Ikkada anedaraki doubt how voting percentage is increased after results. I feel EC still not answered that and after results State EC  ela chesindo Neku telusu

          3. సుప్రీం కోర్ట్ కి వెళ్ళండి సాక్ష్యాధారాలతో.. మీకు ఫలితం ఉంటుంది..

            ఇక్కడ కూర్చుని… మీకు తెలుసు.. మాకు తెలుసు.. అనే కథలు చెపితే ప్రయోజనం ఉండదు,,

  2. అంటే ఒక నాయకుడు నేను పార్టీ లో లేను అని చెప్తే తప్ప తెలుసుకోలేని దుస్థితి లో ఉంది అన్నమాట మన జఫ్ఫా పార్టీ

  3. కూటమి వారు ఏదో చేసేస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నావు కదరా గ్యాస్ ఆంధ్ర మరి వైసిపి హయాంలో బియ్యం మధుసూదన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు ఒకటా రెండా చెబితే చాన్ తాడు లిస్ట్ అవుతుంది అప్పుడు ఎందుకు లెగ లేదురా నీ నోరు. వారు చేస్తే ఒక లెక్క వీరు చేస్తే ఒక లెక్కనా. బియ్యం లేకపోతే ఇంకొకన్ని  వెతుక్కునే పరిస్థితిలో లేని దుస్థితిలో ఉందా వైసిపి ? చెప్పడానికి సిగ్గుండాలి రా గ్యాస్ ఆంధ్ర . మరీ ఇంత సిగ్గులేని తనం పనికిరాదు రా గ్యాస్ ఆంధ్ర . ప్రతి నియోజకవర్గంలో వైసిపి హయాంలో ఎంత అరాచకము ఎంత అకృత్యాలు జరిగాయి ప్రపంచానికి తెలుసు నీకు తప్ప. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ సంకనాకి బతకడం తప్ప స్వతంత్రంగా బతకడం నీకు తెలియదు కదా . ఎప్పుడూ ఒకరి మీద పడి ఏడవటంతోనే నీ బతుకంతా గడిచిపోయేటటువంటి నీది ఒక బతుకేనా పరాన్న బుక్కు. ఇటువంటి పరాన బుక్కు బతుకు బతికి ఎవరిని ఉద్ధరిస్తావో ఏమో నీకే తెలియాలి రా గ్యాస్ ఆంధ్ర .

Comments are closed.