ప్లీనరీ తరువాత డైరెక్ట్ గా అక్కడకి జగన్…?

వైసీపీ ప్లీనరీ హోరు ఇపుడు సాగుతోంది. గత నెల రోజులుగా ఏపీలోని అన్ని జిల్లాలలో మినీ ప్లీనరీలతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలతో పార్టీ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్లీనరీ…

వైసీపీ ప్లీనరీ హోరు ఇపుడు సాగుతోంది. గత నెల రోజులుగా ఏపీలోని అన్ని జిల్లాలలో మినీ ప్లీనరీలతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలతో పార్టీ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్లీనరీ పూర్తి అయ్యాక జగన్ జిల్లా టూర్ల జోరు పెంచుతారు అంటున్నారు.

అమ్మ ఒడి మూడవ విడత కార్యక్రమాన్ని శ్రీకాకుళం వేదికగా నిర్వహించిన జగన్ ఇపుడు విశాఖపట్నంలో మరో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నెల 13న జగన్ విశాఖలో వాహనమిత్ర పధకాన్ని జగన్ లో ప్రారంభిస్తారు. 

ఈ పథకం కింద బటన్ నొక్కి ఆటో డ్రైవర్ల ఖాతాలోకి డబ్బులు జమ చేయనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టగా తీసుకుంది. 

జగన్ ఈ మధ్య కాలంలో విశాఖలో ఎక్కడా బహిరంగ సభ నిర్వహించలేదు. మరి విశాఖ గురించి, ప్రత్యేకించి రాజధాని గురించి ఆయన ఏం చెబుతారా అన్న ఆసక్తి అయితే అందరిలో ఉండడం సహజం. జగన్ విశాఖ టూర్ అలా ఆసక్తి పెంచుతోంది.