Advertisement

Advertisement


Home > Politics - Andhra

అభిమానిపై చేయి చేసుకున్న బాల‌య్య‌

అభిమానిపై చేయి చేసుకున్న బాల‌య్య‌

అభిమానుల‌పై చేయి చేసుకోవడం అగ్ర‌హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అల‌వాటుగా మారింది. తాజాగా మ‌రోసారి ఆయ‌న అభిమానిపై చేయి చేసుకుని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా క‌దిరి నుంచి బాల‌య్య ఇవాళ ప్ర‌చారం ప్రారంభించ‌డానికి హెలికాప్ట‌ర్‌లో వెళ్లారు. హెలికాప్ట‌ర్ ల్యాండ్ కాగానే అభిమానులు ఒక్క‌సారిగా ఆయ‌న ద‌గ్గ‌రికి దూసుకెళ్లారు. బాల‌య్య‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌కు స‌హ‌నం న‌శించింది. ఒక్క‌సారిగా అభిమానిపై చేయి చేసుకున్నారు. దీంతో బాల‌య్యను చుట్టుముట్టిన అభిమానులు షాక్‌కు గుర‌య్యారు.

అభిమానంతో వ‌స్తే చేయి చేసుకోవ‌డం ఏంట‌ని అభిమానులు నిల‌దీస్తున్నారు. బాల‌య్య త‌న వైఖ‌రిని ఎప్ప‌టికీ మార్చుకోరా? అంటూ నిల‌దీస్తున్నారు.

ఇదిలా వుండ‌గా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో స్వ‌ర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో రెండురోజుల పాటు బాల‌య్య బ‌స్సుయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. హిందూపురంలో కూడా ఆయ‌న ఇంత వ‌ర‌కూ ప్ర‌చారం ప్రారంభించిన‌ట్టు లేదు. ఈ ద‌ఫా ఎలాగైనా బాల‌య్య‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ వుంది. వైసీపీ పంతం ఎంత వ‌ర‌కు నెగ్గుతుందో చూడాలి. బాల‌య్య ఇట్లే అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై చేయి చేసుకుంటే చివ‌రికి న‌ష్ట‌పోవాల్సి వుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?