Advertisement

Advertisement


Home > Politics - Andhra

స్పీకర్.. డిప్యూటీ వెరీ హ్యాపీ!

స్పీకర్.. డిప్యూటీ వెరీ హ్యాపీ!

పక్క పక్క జిల్లాలు, ఇద్దరికి రాజ్యాంగ పదవులు. ఇద్దరూ మంచి మాటకారులే. అందుకే ఒకరు స్పీకర్ అయ్యారు, రెండవ వారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉంటూ మరోసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు. ఆయనకు టీడీపీతో టఫ్ గానే పోరు నడుస్తోంది. అయితే ఇండిపెండెంట్ ఒకరికి గాజు గ్లాస్ గుర్తు దక్కింది. దాంతో టీడీపీ కూటమిలో కలవరం రేగింది. గెలుపు ధీమా ఇప్పుడు అక్కడ సడలుతోంది.

ఆముదాలవలసలో ఎవరి గెలిచినా మెజారిటీలు తక్కువగానే వస్తాయి అని ఊహిస్తున్న వేళ గాజు గ్లాస్ ఎన్ని ఓట్లు చీలుస్తుంది అన్నదే ఇప్పుడు అంతు చిక్కని లెక్కగా మారుతోందిట. తాజా పరిణామాలతో స్పీకర్ శిబిరం మరింత దూకుడు పెంచి మరీ జనంలోకి వెళ్తోంది.

విజయనగరంలోనూ అదే పరిస్థితి. టీడీపీ రెబెల్ గా మీసాల గీత పోటీ చేస్తున్నారు. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది. ఆమె వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. టీడీపీకి ఈ పరిణామం ముచ్చెమటలు పట్టిస్తోంది. అదే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వర్గానికి ఫుల్ జోష్ ని నింపుతోంది.

విజయనగరంలో ఈసారి కూడా తమదే గెలుపు అన్న ధీమా వైసీపీకి ఉన్నప్పటికీ ఇపుడు గీత రెబెల్ గా పోటీ చేయడం గాజు గ్లాస్ సింబల్ రావడంతో మెజారిటీ ఎంత అన్నదే తాము లెక్క వేసుకోవాలని కోలగట్ల వర్గీయులు భావిస్తున్నారు. లేటెస్ట్ గా మారిన పొలిటికల్ ట్రెండ్స్ తో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరి క్యాంపులలో తెగ హుషార్ కనిపిస్తోంది అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?