రెండు నెల‌లు ఆగు.. జ‌గ‌న్ పెళ్లామో? మొగుడో తెలుస్తుంది!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తాడేప‌ల్లిగూడెం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని రాచ‌మ‌ల్లు త‌ప్పు ప‌ట్టారు. Advertisement…

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై తాడేప‌ల్లిగూడెం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని రాచ‌మ‌ల్లు త‌ప్పు ప‌ట్టారు.

జ‌గ‌న్ ప‌దేప‌దే త‌న‌కు నాలుగు పెళ్లిళ్లు అయ్యిన‌ట్టు విమ‌ర్శిస్తుంటార‌ని ప‌వ‌న్ అన్నారు. త‌న‌కు మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అయ్యాయ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. నాలుగో పెళ్లాం జ‌గ‌నే అని ప‌వ‌న్ వ్యంగ్యంగా అన్నారు.

ఈ కామెంట్స్‌పై రాచ‌మ‌ల్లు త‌నదైన రీతిలో తిప్పి కొట్టారు. జ‌గ‌న్‌ను త‌న నాలుగో పెళ్లామ‌ని ప‌వ‌న్ అన‌డం ఆయ‌న అహంకారానికి ప‌రాకాష్ట‌గా అభివ‌ర్ణించారు. రెండు నెల‌లు ఆగితే… ప‌వ‌న్‌కు జ‌గ‌న్ నాలుగో పెళ్లామా? లేక మొగుడా? అనేది తెలుస్తుంద‌ని ఘాటు స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న్ సంస్కారం లేని వ్య‌క్తి అంటూ ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

రానున్న ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను ఓడించి, జ‌గ‌న్ అంటే మొగుడ‌ని నిరూపిస్తార‌ని రాచ‌మ‌ల్లు కౌంట‌ర్ సారాంశంగా చూడొచ్చు. ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు పాల్ప‌డుతున్నారు. రాజ‌కీయాల‌కు ఏ మాత్రం సంబంధం లేని మ‌హిళ‌ల‌కు కూడా ఇందులోకి లాగుతున్నారు. ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ కాలుష్యాన్ని భ‌రించ‌క త‌ప్ప‌దు.