మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అతిపెద్ద షాక్ ఇచ్చారు. స్కిల్ స్కామ్లో ఏపీ సీఐడీతో వేగలేక చంద్రబాబు, లోకేశ్ నానా తిప్పలు పడుతుంటే, ఉండవల్లి ఈ కేసులో ఎంటర్ కావడం విశేషం. దీంతో చంద్రబాబు మెడకు స్కిల్ స్కామ్ ఉచ్చు మరింత బిగుసుకునే ప్రమాదం పొంచి ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి భారీ అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపై 2021, డిసెంబర్ 9న ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐ లేదా ఈడీ లేదా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ను దాఖలు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
ఆర్థిక అవకతల అంశం కావడంతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, కావున లోతైన విచారణ జరగాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు బాధ్యత అప్పగించాలని పిటిషన్లో ఉండవల్లి కోరారు. అసలే రామోజీరావు ఆర్థిక నేరానికి పాల్పడ్డారని పట్టువదలని విక్రమార్కుడిలా ఉండవల్లి పోరాడుతున్నారు. రామోజీని ముప్పుతిప్పలు పెడుతున్నారు.
రామోజీ ఇప్పటి కష్టాలకు ప్రధాన కారకుడు ఉండవల్లి బయటపెట్టిన ఆర్థిక అవకతవకలే కారణం. చంద్రబాబు కేసులో ఉండవల్లి ఎంటర్ కావడంతో ప్రమాదం ఏదో ముంచుకొస్తోందనే భయాందోళన టీడీపీలో మొదలైంది. ఒకవేళ ఉండవల్లి వేసిన పిటిషన్పై ఆయనకు సానుకూల తీర్పు వస్తే మాత్రం చంద్రబాబు మరింతగా కష్టాల్లో కూరుకుపోయినట్టే. స్కిల్ స్కామ్లో సీబీఐ, ఈడీ ఇతరత్రా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు దిగితే మాత్రం బాబు కేసు ఏ తీరానికి చేరుతుందో చెప్పడం కష్టం. బాబుకు మంచి రోజులు మాత్రం ఇప్పట్లో కనుచూపు మేరలో కనిపించడం లేదన్నది వాస్తవం.