బీజేపీకి ఆ ఊపు లేదా!

ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనతలు, ప్రతిపక్షాల నుంచి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను చేర్చేసుకోవడం, విపక్షం బలహీనతతో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ బయటపడాల్సిందే కానీ.. అంత ఊపులేదు.. అని అంటున్నారు పరిశీలకులు, విశ్లేషకులు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ…

ఏదో కాంగ్రెస్ పార్టీ బలహీనతలు, ప్రతిపక్షాల నుంచి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను చేర్చేసుకోవడం, విపక్షం బలహీనతతో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ బయటపడాల్సిందే కానీ.. అంత ఊపులేదు.. అని అంటున్నారు పరిశీలకులు, విశ్లేషకులు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ గొప్ప ఊపు మాత్రం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి మహారాష్ట్రలో అయితే ఒక దశలో 170 సీట్లకు పోటీ చేయాలని అనుకున్న భారతీయ జనతా పార్టీ, చివరకు 150కే తగ్గిందట.

శివసేనకు అదనంగా ఇరవై సీట్లను కేటాయించిందట కమలం పార్టీ! ఇదంతా ఆ పార్టీ బలహీనతే అని అంటున్నారు విశ్లేషకులు. మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి బోలెడంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఏపీలో చంద్రబాబు నాయుడు చేర్చుకున్న రీతిన అక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకుంది కమలం పార్టీ. అలా ప్రతిపక్షాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని నమ్ముకుందట. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వమే అద్వాన్నంగా ఉంది.

రాహుల్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇవ్వడం ఏమో కానీ, తను డిప్రెషన్లోకి వెళ్లినట్టుగా ఉన్నాడు. దేశంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. బీజేపీ పై ఏదో ఒక రోజుకు విరక్తి రాకపోదా.. తమకు ఓట్లు పడకపోవా అన్నట్టుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఇదే కమలం పార్టీకి ఇప్పుడు ఉపశమనం కాబోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

చంద్రబాబుకు ఎందుకు రుచించడం లేదు