చంద్రబాబు యూటర్న్ లు.. మరి ఇంత చీప్ గానా!

'యూటర్న్ అంకుల్' అంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చంద్రబాబును ఎద్దేవాచేస్తూ ఉన్నారు. అది ఇప్పటిమాట కాదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తీసుకున్న యూటర్న్ లను ఉద్దేశించి వారు ఆ వ్యాఖ్యలు…

'యూటర్న్ అంకుల్' అంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చంద్రబాబును ఎద్దేవాచేస్తూ ఉన్నారు. అది ఇప్పటిమాట కాదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తీసుకున్న యూటర్న్ లను ఉద్దేశించి వారు ఆ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు యూటర్న్ లకు విసిగిపోయి ప్రజలు కూడా ఆయనను దించేశారు. ఆఖరికి కుప్పంలో చంద్రబాబు మెజారిటీ చాలావరకూ ఈసారి తగ్గిపోయిందంటే ఆయన యూటర్న్ ల పట్ల ప్రజలకు ఏస్థాయి విరక్తి వచ్చిందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

కామెడీ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు యూటర్న్ లు ఇప్పుడు కూడా ఆగడంలేదు. బీజేపీతో కలిసి ఉన్నంతసేపూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒకరకంగా మాట్లాడారు. అంతకు పూర్వం ఎన్నికల ముందు మాట్లాడిన రీతికి పూర్తి భిన్నంగా అప్పుడంతా మాట్లాడారు. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాకా చంద్రబాబు నాయుడు తీరు మారిపోయింది. కమలం పార్టీపై దుమ్మెత్తి పోయసాగారు. మోడీని అనరాని మాటలన్నారు.

బహుశా మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినట్టుగా పాకిస్తాన్ వాళ్లు కూడా తిట్టి ఉండరేమో. ఇప్పుడేమో మోడీని మళ్లీ మోయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మోడీతో విబేధించడం తప్పైపోయిందని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. ఇలా బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారాయన.

అయితే చంద్రబాబు నాయుడి యూటర్న్ లు రాజకీయ విధానాల విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ సాగుతూ ఉన్నాయి. అందుకు మరో ఉదాహరణ మెగా కృష్ణారెడ్డి వ్యవహారం. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ వారికి అగ్రతాంబూలం దక్కింది.

చంద్రబాబు నాయుడి కలల పంట పట్టిసీమతో పాటు పలు ఎత్తిపోతల పథకాలను, నదుల అనుసంధానం అని, కొండవీటి ప్రాజెక్టు అని.. ఇలా చంద్రబాబు నాయుడు అన్ని ప్రాజెక్టులనూ వాళ్లకే అప్పగించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు మెగాకు అప్పగించిన పనుల విలువ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అని అంచనా!

ఇప్పుడే అదే మెగా కృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు తిడుతూ ఉన్నారు. అప్పుడేమో ఆయనకే సన్మానాలు చేశారు. ఇప్పుడేమో ఆయనను తిడుతూ ఉన్నారు. ఆఖరికి పారిశ్రామిక వేత్తలతో  వ్యవహరించే తీరులో కూడా చంద్రబాబు నాయుడు తనదైన ద్వంద్వ వైఖరి, తన మార్కు యూటర్న్ లు తీసుకుంటూ ఉన్నారని స్పష్టం అవుతూ ఉంది.

చంద్రబాబు నాయుడు తానా అంటే ఆయన అనుకూల మీడియా వర్గాలు తందానా అంటూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఇలాంటి టర్న్ కు అయినా కట్టుబడతారని అనడానికి లేదు. ఈరోజు ఇలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, రేపు మళ్లీ మరో టర్న్ తీసుకుని మాటలన్నీ మార్చేసినా ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. దటీజ్ చంద్రబాబు నాయుడు! 

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ