ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కేకి స‌తీ వియోగం

ఏబీఎన్‌- ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు స‌తీ వియోగం క‌లిగింది. ఆర్కే స‌తీమ‌ణి వేమూరి క‌న‌క‌దుర్గ (63) అనారోగ్యంతో మృతి చెందారు.  Advertisement గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స…

ఏబీఎన్‌- ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు స‌తీ వియోగం క‌లిగింది. ఆర్కే స‌తీమ‌ణి వేమూరి క‌న‌క‌దుర్గ (63) అనారోగ్యంతో మృతి చెందారు. 

గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల డైరెక్ట‌ర్‌గా వేమూరి క‌న‌క‌దుర్గ చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగారు.

అంత‌కు ముందు ఆమె ఒక బ్యాంక్‌లో ఉన్న‌తోద్యోగి. అనంత‌రం ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల్లో డైరెక్ట‌ర్‌గా …ప్ర‌ధానంగా ఆర్థిక వ్య‌వ‌హారాలు చూసేవార‌ని స‌మాచారం. 

ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల ఎదుగుద‌ల‌లో ఆమె పాత్ర కీల‌కం. ఆమెకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వేమూరి ఆదిత్య ఆంధ్ర‌జ్యోతి -ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు.

క‌న‌క‌దుర్గ మృతితో ఆంధ్ర‌జ్యోతి మీడియా కుటుంబ స‌భ్యులు శోక‌సంద్ర‌లో మునిగిపోయారు. క‌న‌క‌దుర్గ మృతికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.