జైలు పాలైన తమ పార్టీ నేతలను పరామర్శించడాన్ని తమ రాజకీయ వ్యాపకంగా మార్చుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి.. వంటి వాళ్లను పరామర్శించిన వీళ్లు.. ఇప్పుడు మరో రౌండ్ లో అచ్చెన్నాయుడును పరామర్శించనున్నారట.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో రచ్చ చేయబోయి అరెస్టు అయిన తెలుగుదేశం నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు అయ్యే ముందు తను కాబోయే హోం మంత్రిని అంటూ.. అందరి అంతూ చూస్తానంటూ అధికారులను హెచ్చరించిన అచ్చెన్నాయుడుకు.. మంత్రి పదవి విషయంలో హామీ ఇవ్వడానికి వెళ్తున్నారో, హెచ్చరించడానికి వెళ్తున్నారో కానీ.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చెరో దఫా అచ్చెన్నను పరామర్శిస్తారట.
జైల్లో ఆయనను కలిసి .. వీళ్లు బయటకు వచ్చి రాజకీయ ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. బీసీలపై దాడి.. అనే తమ రొటీన్ డైలాగ్ ను వదిలే అవకాశాలు ఏ మాత్రం లేకపోలేదు! తమ పార్టీకి చెందిన ఏ కుల, ఏ సామాజికవర్గం నేతలు అరెస్టు అయితే ఆ కుల రాజకీయం చంద్రబాబుకు కొత్త కాదు, దాన్నే లోకేష్ అవపోసన పట్టినట్టున్నాడు. కాబట్టి అచ్చెన్న అరెస్టుపై కులం కోణంలోనే స్పందించే అవకాశాలున్నాయి.
అయినా.. అందరినీ పరామర్శించి పాపం భూమా అఖిలప్రియను మాత్రం చంద్రబాబు, లోకేష్ లు పట్టించుకుంటున్నట్టుగా లేరు. తమపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ కక్ష కట్టాయని భూమా యువ కిశోరం జగత్ విఖ్యాత్ ఆవేదన వ్యక్తం చేశాడు కూడా. అయినా చంద్రబాబు, లోకేష్ లకు వారి గోడు పట్టినట్టుగా లేదు! ఇదీ చంద్రబాబు మార్కు మరో థర్డ్ గ్రేడ్ రాజకీయం!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు