బాబుగారి బూతు పురాణం.. ఈయనకు ఏమైంది?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మానసిక స్థితి మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు రకరకాల అనుమానాలు వ్యక్తంచేస్తూ ఉంటారు. కొందరు నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం సరిగా లేదంటూ కేవీపీ…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మానసిక స్థితి మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు రకరకాల అనుమానాలు వ్యక్తంచేస్తూ ఉంటారు. కొందరు నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం సరిగా లేదంటూ కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఇదివరకూ వ్యాఖ్యానించారు. ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు తాజా ప్రెస్ మీట్ విని సభ్య సమాజం విస్తుపోతోంది.

ఇంతకీ చంద్రబాబుకు ఏమైంది? అని ప్రశ్నిస్తూ ఉన్నారు అనేకమంది. ఎవరో సోషల్ మీడియాలో తెలుగుదేశం మహిళా నేత మీద ఏదో పోస్టు పెట్టారట. అందులో పచ్చి బూతులున్నాయి. ఆ బూతులను తెలుగుదేశం పార్టీ అధినేత పెద్ద స్క్రీన్ మీద వేసి మరీ చూపించారు. ప్రొజెక్టర్ ద్వారా చూపించడమే కాదు, ఆ బూతులను చదవి మరీ వినిపించారు చంద్రబాబు నాయుడు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పని చివరకు ఇలా తయారైంది! సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో ఎన్నో కాకిరెట్టలు ఉంటాయి.

అంతవరకూ ఎందుకు.. ఇదే వెబ్ సైట్ కామెంట్ సెక్షన్ లో చంద్రబాబు నాయుడి అభిమానులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు.. ఎంతటి సంస్కారాన్ని ఒలకపోస్తూ ఉంటారో వీక్షకులంతా గమనిస్తూనే ఉంటారు. తన పార్టీ వాళ్లు అంతా పతివ్రతలు అయినట్టుగా.. సోషల్ మీడియాలో వారు చాలా సంస్కారవంతులు అయినట్టుగా.. ఎవరినీ ఏమీ అనని శుద్ధపూసలు అయినట్టుగా చంద్రబాబు నాయుడు తన పార్టీ వారిని ఎవరో తిట్టారని ఆ బూతులను చదవి మరీ వినిపించి ఆనందం పొందారు!

ఈ తీరు చూస్తుంటే.. చంద్రబాబుకు నిజంగానే  ఏదో అయ్యింది, అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారని సామాన్యులు చర్చించుకుంటూ ఉన్నారు. కాస్త విజ్ఞత ఉన్న వాళ్లు, సోషల్ మీడియా మీద అవగాహన ఉన్న వాళ్లు.. ఎవరూ ఇలాంటి బూతులను ప్రొజెక్ట్ చేసే పని పెట్టుకోరు. ఎద్దుపుండు కాకికి ముద్దు అన్నట్టుగా.. చంద్రబాబు నాయుడు వ్యవహరించారని, సాయంత్రం వేళ ఇళ్లలో వార్తా చానళ్లను పెట్టుకుని చూసేవారికి తన నోటితో పచ్చిబూతులు వినిపించి.. చంద్రబాబు నాయుడు ఏదో ఆనందం పొందుతున్నారని, ఇదొక పర్వర్టెడ్ మెంటాలిటీ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

బూతులను చదవి, గట్టిగా వినిపించి… చంద్రబాబు ఏదో శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారని మానసిక విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇలా బూతులను చదవడం మొదలుపెడితే, తెలుగుదేశం పార్టీ అభిమానుల నుంచి జాలువారే బూతులను కూడా చదివి వినిపిస్తూ చంద్రబాబుకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయడానికి మరికొందరు సిద్ధం అవుతూ ఉన్నారట. మొత్తానికి ప్రతిపక్షంలో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ వెళ్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'