Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు, పవన్.. కొత్త నాటకాలు

చంద్రబాబు, పవన్.. కొత్త నాటకాలు

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో స్పందించవలసి వచ్చే సందర్భాల్లో చంద్రబాబునాయుడు. పవన్ కల్యాణ్ కార్మికుల ముఖప్రీతికోసమా అన్నట్లుగా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకు వేసి.. ఈనెల 19న జరగనున్న బంద్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. చంద్రబాబునాయుడు మాత్రం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని... అవి పరిష్కారం కాదని, బతికి సాధించాలని.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు నెల్లూరు నుంచి హితవు చెబుతున్నారు.

అయితే తమాషా ఏంటంటే.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మనస్ఫూర్తిగా మద్దతివ్వడానికి.. ఆ ఇద్దరు నాయకులకు నోరు పెగలడం లేదు. అలా మద్దతిస్తే గనుక... పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ ప్రత్యర్థి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వేనోళ్ల శ్లాఘించినట్టే అవుతుంది. అందుకే వారు తెగించి మాట్లాడలేకపోతున్నారు. అలాగని.. ఏమీ మాట్లాడకుండా ఉంటే.. జనం ఛీకొడతారని, ఆర్టీసీ కార్మికలోకం యావత్తూ తమ పార్టీలను ఈసడించుకుంటారని వారికి తెలుసు. అందుకే మింగలేక కక్కలేక.. ఇబ్బంది పడుతున్నారు.

పవన్ కల్యాణ్ తొలుతే ఆర్టీసీ వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు. వారి ‘న్యాయమైన’ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు బంద్ కు కూడా మద్దతిచ్చారు. ఈ మద్దతంతా కేవలం ప్రెస్ నోట్ లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. తమ పార్టీ శ్రేణులంతా వారికి మద్దతుగా రోడ్ల మీదకు రావాలని.. పవన్ కల్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వలేదు. చంద్రబాబు కూడా ఆత్మహత్యలు వద్దు అని ఉపదేశాలు చేస్తున్నారు.

ఈ ఇద్దర నాయకులు కూడా.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ధర్మమే.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ చొరవ తీసుకోవాలని అనడంలేదు. నిజానికి అలాంటి నిర్ణయం చాలా సాహసోపేతమైనది. అయినా సరే.. జగన్ వారికి ఆ న్యాయం చేశారు. ఏపీలో చేయగలుగుతున్నారు గనుక.. అదే తరహాలో తమను కూడా ప్రభుత్వంలో కలపాలని తెలంగాణలో డిమాండ్ వచ్చింది. దీనికి పరిపూర్ణ మద్దతివ్వడం అనేది.. ఏపీలో జగన్ నిర్ణయాన్ని శెభాష్ అన్నట్లే అవుతుంది. నోరారా.. మంచి నిర్ణయాన్ని ప్రశంసించలేక.. ఈ నాయకులు ఇలా డ్రామాలు ఆడడం ఎందుకో అర్థంకావడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?