Advertisement

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ లో తెలుగుదేశం!

కాంగ్రెస్ లో తెలుగుదేశం!

కాంగ్రెస్ పార్టీ నుంచిశేరిలింగంపల్లి అభ్యర్థిగా మండవ రమేష్ పేరు ఫైనల్ అవుతుందని అప్పుడే వార్తలు వండేస్తున్నారు. అయినా అవుతుంది. పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా వున్న రేవంత్ రెడ్డికి తెలుగుదేశం బంధాలు బలంగా వున్నాయని ఊహాగానాలు వున్నాయి. 

అలాగే కాంగ్రెస్ వ్యూహకర్తలకు సామాజిక బంధాలు వున్నాయనే వార్తలు వున్నాయి. అందువల్ల మండవ రమేష్ కు టికెట్ ఇవ్వడంలో అస్సలు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆంధ్ర మూలాలు వున్నాయి. సెటిలర్లు పెద్ద సంఖ్యలో వున్న నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆంధ్ర మూలాలు వున్నవారికి టికెెట్ ఇవ్వడం పెద్దగా అభ్యంతరం కాదు. 

ఇంకా అసలు విషయం వుండనే వుంది. జగన్ పాలనలో అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి రమేష్. వారి న్యాయ పోరాటానికి ఆర్థికంగా బలంగా సాయం చేసిన వ్యక్తి. అంతే కాదు. రాజగురువు అని ముద్దుగా పిలుచుకునే రామోజీ రావు మార్గదర్శి వ్యవహారం లో కూడా జగన్ ప్రభుత్వానికి ఎదురుగా నిల్చున్నారు. అటు కోర్టులో, ఇటు రోడ్ మీద కూడా పోరాటం సాగించారు.

ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ కు ఇంతకన్నా గట్టి అభ్యర్థి ఎక్కడ దొరుకుతారు. అందుకే కాంగ్రెస్ కు సలహాలు ఇచ్చే వ్యూహకర్తలు ఈ పేరే సూపర్ అని వుండొచ్చు. రేవంత్ రెడ్డి కి కూడా ఇదే ఓకే చేయాలని అనిపించి వుండొచ్చు. ముందు ముందు తెలంగాణ కాంగ్రెస్ లో మరెన్ని సిత్రాలు చూడాలో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?