Advertisement

Advertisement


Home > Politics - Gossip

'జగన్ మా వాడే..' కాంగ్రెస్ స్టార్ట్స్!

'జగన్ మా వాడే..' కాంగ్రెస్ స్టార్ట్స్!

మొన్నటి వరకూ జగన్ తమ ప్రధాన శత్రువు అని ప్రకటించిన ఉమెన్ చాందీకే అప్పగించిందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. జగన్ ను బుజ్జగించే పని! ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న ఉమెన్ చాందీ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని జాతీయ మీడియా వర్గాలు కూడా ధ్రువీకరిస్తూ ఉన్నాయి.

జగన్ కేంద్రంలో తమకే మద్దతను ఇవ్వాలని కోరుతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ విషయంలో జగన్ సూటిగా స్పందిస్తున్నారని సమాచారం. తనకు ఢిల్లీలో ఎవరిమీదా రాగధ్వేషాలు లేవని, ఫలితాలు వచ్చాకా పరిస్థితులను బట్టి స్పందించడం ఉంటుందని జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్యన కాంగ్రెస్ వాళ్లు జగన్ ను మరింతగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. 'జగన్ మోహన్ రెడ్డి మావాడే, మా కాంగ్రెస్ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు..' అంటూ జగన్ ను ఏపీ జనాలకు కొత్తగా పరిచయం చేసే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ పార్టీ.

ఈ మేరకు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా చంద్రబాబు మీద కూడా ధ్వజమెత్తారు చింతామోహన్. చంద్రబాబు నాయుడు అవకాశవాది అని, అవసరం కొద్దీ కాంగ్రెస్ చుట్టూ, తృణమూల్ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారని.. జగన్ మాత్రం తమవాడంటూ చింతామోహన్ వ్యాఖ్యానించారు. 

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?