జనసేన ఎమ్మెల్యే గుస్సా నిజమేనా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వం మీద గుస్సా అయ్యారని వార్త ఇపుడు తెగ వైరల్ గా మారింది. పెందుర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు సొంత…

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వం మీద గుస్సా అయ్యారని వార్త ఇపుడు తెగ వైరల్ గా మారింది. పెందుర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు సొంత ప్రభుత్వం మీదనే ఆగ్రహంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా అన్నది ఇపుడు అంతా తర్కించుకుంటున్నారు.

ఆయన తన మాట నియోజకవర్గంలో చెల్లడం లేదని ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన తన గన్ మెన్లను వెనక్కి పంపించారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గంలో ఇద్దరు పోలీసు అధికారుల నియామకంలో తన మాట చెల్లలేదని ఆ ఎమ్మెల్యే ఆగ్రహం చెందారని అంటున్నారు.

పెందుర్తి పరవాడ పోలీస్ స్టేషన్లలో సీఐ నియామకాల విషయంలో ఆయన కొన్ని పేర్లను ఉన్నతాధికారులకు సూచించారని అంటునారు. అయితే వారిని పక్కన పెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో తన మాట తన సొంత ఇలాకాలో చెల్లకపోవడంతో ఇక ఎందుకు అన్నట్లుగా ఆయన తనకు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు అని అంటున్నారు.

ఉమ్మడి విశాఖలోనే హోం మంత్రి ఉన్నారు. పెందుర్తి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం. తాజా ఎన్నికల్లో ఆయన పెందుర్తినే చివరి దాకా పట్టుబట్టి మాడుగులకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఆయన గెలిచినా కూడా పెందుర్తిలో ఆయన హవా కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. కూటమిలో మిత్రుల మధ్య ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు కానీ జనసేన ఎమ్మెల్యే గుస్సా నిజం అయితే మాత్రం ఇది సీరియస్ వ్యవహారమే అని అంటున్నారు.

3 Replies to “జనసేన ఎమ్మెల్యే గుస్సా నిజమేనా?”

  1. JANASENA మీద తర్వాత ఐనా ఏడవచ్చు గాని…. ఇంతకీ పులివెందుల లో అసలు మన అన్నయ్యను ఎవడైనా పట్టించుకుంటున్నాడా GA….😂😂

  2. GA niku chip dobbinda enti. Ekkada evariki post ivvallo home minister and aa deparment heads chuskuntaru. MLA adigadano leka MLA ki kavalsina vallani ichhukuntu pothe malli nuve inko article raasthavu MLA ki kavasina vallani techukoni arachakalu chesthunnaru ani nuvvu maarava inka..

  3. ఎం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ?

    ఎం లేదు ఈ వరద దోపిడీని ఎలా అరికట్టాలి అని!

    ఇందులో ఆలోచించడానికేముంది..దోపిడీ చేసేదే మన పచ్చ బ్యాచ్ కదా…

    అందుకే అమ్మోరు ఆగ్రహం చెంది కరకట్టని ముంచేసింది!

    డబల్ ఇంజిన్ ఫెయిల్ అయిన బాబు హెలికాప్టర్ లేక బోటుల మీద పబ్లిసిటీ మొదలెట్టాడు.

    ఇంకో రెండు రోజుల్లో మోడీ క్యాబేజి ఇస్తాడు. కరకట్ట వాసుల పేరు మీద పచ్చ ముఠా దోపిడీ చేస్తుంది.

    ఒక దెబ్బకి రెండు పిట్టలు

    వరదల్లో ప్రజలని దోపిడీ చేసాము.

    వరద ప్యాకేజీ ప్రజలకి అందకుండా దోపిడీ చేస్తాము.

    పచ్చడిగాళ్ళని కోటీశ్వరులని చేస్తాను.

Comments are closed.