Advertisement

Advertisement


Home > Politics - Gossip

మెగాస్టార్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు?

మెగాస్టార్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు?

తెలుగునాట ఎన్నికల వేడి అందుకుంటోంది. ఎవరు ఏం మాట్లాడినా ఎన్నికల దిశగా అర్థాలు తీస్తున్నారు. ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలతో నానా రచ్చ జరిగింది. 

ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లారన్న వార్తలు వినిపిస్తూ, ఆసక్తి పెంచుతున్నాయి. మెగాస్టార్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు?

భోళాశంకర్ సినిమా విడుదల తరువాత మెగాస్టార్ బయల్దేరి ఎక్కడికో వెళ్లారు. ఆ ఎక్కడికో అన్నది ఎవరికి పెద్దగా తెలియకపోయినా ఢిల్లీ వెళ్లారని విశ్వసనీయ, సన్నిహిత వర్గాల భోగట్టా. అయితే ఢిల్లీ వెళ్లడం వెనుక రాజకీయ కారణాలు ఏమీ లేవని, కేవలం పక్కా పర్సనల్ టూర్ అని చెబుతున్నారు.

హీరోలు, సెలబ్రిటీలు ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటే విదేశాలకు వెళ్తారు. లేదా టూరిజం ప్లేస్ లకు వెళ్తారు. ఢిల్లీ వెళ్లడం కాస్త ఆశ్చర్యమే. పైగా చిరంజీవి ఢిల్లీ వారం రోజుల పాటు వుండబోతున్నారని తెలుస్తోంది. అంతే కాదు పుట్టిన రోజు వరకు హైదరాబాద్ లో అందుబాటులో వుండరని, బర్త్ డే వేళకు బెంగళూరు వస్తారని తెలుస్తోంది.

మోడీ, అమిత్ షా తదితర కేంద్ర నాయకులకు చిరు అంటే గౌరవం వుంది. అలాగే ఢిల్లీలో చాలా మందికి చిరు అంటే అభిమానం వుంది. మరి ఇప్పుడు ఢిల్లీ వెళ్లింది ఎందుకు? అన్నది ఈ నేపథ్యంలో చర్చకు వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?