Advertisement

Advertisement


Home > Politics - Gossip

రాజ‌ధానిలో ప‌వ‌న్‌కు 62 ఎక‌రాల భూమి?

రాజ‌ధానిలో ప‌వ‌న్‌కు 62 ఎక‌రాల భూమి?

"అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు రాజ‌ధాని మార్చాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెనుక పెద్ద కుట్ర ఉంది. కేవ‌లం వైసీపీ నేత‌లు భూదందా చేసేందుకే రాజ‌ధాని మార్చాల‌నుకుంటున్నారు" అని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఢిల్లీలో బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను గురువారం క‌లిసిన త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడిన ప‌వ‌న్ అక్క‌డ కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేశాడు. వైసీపీ భూదందాల‌పై ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌వ‌న్‌కు రాజ‌ధాని అమ‌రావ‌తిలో 62 ఎక‌రాలు, ఆయ‌న మాతృమూర్తి అంజ‌నాదేవి పేరుపై 20 ఎక‌రాల‌ భూమి ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కేవ‌లం ఆరోప‌ణ‌లే కాదు...ఆధారాలు కూడా చూపుతున్నారు.

ఒక చాన‌ల్‌లో జ‌రిగిన డిబేట్‌లో వైసీపీ అధికార ప్ర‌తినిధి ర‌విచంద్రారెడ్డి ఈ సంచల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు ఆధారాల‌ను కూడా లైవ్‌లో చూపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ర‌విచంద్రారెడ్డి చెప్పిన ప్ర‌కారం 2018, ఏప్రిల్ 13న కొణిదెల ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరుపై రాజుల‌పాలెం, లింగాయ‌పాలెంల‌లో స‌ర్వే నంబ‌ర్ 64 బీ, 67బీ, 83బీ, మంద‌డం ద‌గ్గ‌ర 131 ఎ, 139ఎలో 62 ఎక‌రాలు కొన్న‌ట్టు డాక్యుమెంట్స్ నంబ‌ర్ల‌తో స‌హా చూపుతూ ఆరోప‌ణ‌లు చేశాడు. ఈ భూమి విలువ రూ.2 కోట్ల 40 ల‌క్ష‌ల 46వేలు. అని పేర్కొన్నాడు.

అంతేకాదు  ప‌వ‌న్ పోరాటానికి పెద్ద విలువ ఉండ‌దు. వైసీపీ ఆరోప‌ణ‌లే నిజ‌మైతే ప‌వ‌న్‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టే. ఎందుకంటే ఇంత‌కాలం వైసీపీ నేత‌లు విశాఖ‌లో భూములు కొన్నార‌ని ఆరోపిస్తున్న ప‌వ‌న్‌...త‌న భూముల‌పై స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంది. కాగా ప‌వ‌న్‌పై వైసీపీ ఆరోప‌ణ‌లు, భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?