Advertisement

Advertisement


Home > Politics - Gossip

త్వ‌ర‌లో టీడీపీకి కొత్త వ్యూహ‌క‌ర్త‌!

త్వ‌ర‌లో టీడీపీకి కొత్త వ్యూహ‌క‌ర్త‌!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీకి త్వ‌ర‌లో కొత్త వ్యూహ‌క‌ర్త రానున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. ఇప్ప‌టికే రాబిన్‌శ‌ర్మ టీడీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

అయితే టీడీపీ ఆశించిన స్థాయిలో రాబిన్‌శ‌ర్మ నుంచి ఔట్‌పుట్ రాలేద‌ని తెలిసింది. దీంతో రాబిన్‌శ‌ర్మ‌ను కేవ‌లం లోకేశ్ ప్ర‌చారం, అలాగే చంద్ర‌బాబు స‌భల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల వ‌ర‌కే ప‌రిమితం చేసింది.

జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి మంచి వ్యూహ‌క‌ర్త అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు, లోకేశ్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక కీల‌క వ్యూహ‌క‌ర్త‌తో చ‌ర్చ‌లు కూడా ముగిసిన‌ట్టు స‌మాచారం. అయితే ప్ర‌చారంలో ఉన్న‌ట్టు కాంగ్రెస్ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలును తీసుకునేందుకు చంద్ర‌బాబు, లోకేశ్ ఆస‌క్తిగా లేర‌ని తెలిసింది.

ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త‌తో టీడీపీ చ‌ర్చ‌లు దాదాపు పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. బ‌హుశా నాలుగైదు రోజుల్లో స‌ద‌రు వ్యూహ‌క‌ర్త‌ను తీసుకునే విష‌య‌మై కొలిక్కి రావ‌చ్చు. 

అధికారికంగా ఒప్పందం కుదిరిన త‌ర్వాత వెంట‌నే రంగంలోకి దింపాల‌ని చంద్ర‌బాబు, లోకేశ్ యోచిస్తున్నారు. ఎందుకంటే ఎన్నిక‌ల‌కు పెద్ద‌గా స‌మ‌యం లేదు. మ‌రోవైపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గ‌తంలో కంటే ముందే వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ కీల‌క‌మైన వ్యూహ‌క‌ర్త‌ను టీడీపీ అతి త్వ‌ర‌లో ఏపీ బ‌రిలో దింప‌నుంది. జ‌గ‌న్ వ్యూహాల‌ను అంచ‌నా వేయ‌డంతో పాటు తిప్పికొట్టే స‌ద‌రు స్ట్రాట‌జిస్ట్ త్వ‌ర‌లో మ‌న ముందుకు రానున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?