ప్రేమ వివాహం.. ప్రాణం తీసిన అనుమానం

మూడేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కూడా నాలుగేళ్లు అవుతోంది. ఇలాంటి దాంపత్య జీవితంలో అనుమానాలు ఉంటాయా? కానీ గురుమూర్తి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానించాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. ఫలితంగా ఆ…

మూడేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని కూడా నాలుగేళ్లు అవుతోంది. ఇలాంటి దాంపత్య జీవితంలో అనుమానాలు ఉంటాయా? కానీ గురుమూర్తి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానించాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. ఫలితంగా ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. విజయవాడలో జరిగింది ఈ ఘటన.

సాయిదివ్య, గురుమూర్తి మహంతిపురంలో ఉంటున్నారు. వీళ్లు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. అంతా బాగుందనుకున్న టైమ్ లో గురుమూర్తి మెదడులో విషపు బీజం నాటుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అనుమానించడం మొదలుపెట్టడం.

దాదాపు ఏడాదిగా ఇలా భార్యను అనుమానిస్తూనే ఉన్నాడు గురుమూర్తి. కొన్నాళ్ల పాటు ఓపిగ్గా ఈ అవమానాల్ని భరించిన సాయిదివ్వ, ఇక భరించలేకపోయింది. నిన్న రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఇలా గురుమూర్తి అనుమానాలకు ఓ నిండు ప్రాణం బలైంది. మూడేళ్ల చిన్నారి తన తల్లిని కోల్పోయింది. సాయిదివ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గురుమూర్తిపై కేసు నమోదుచేశారు.

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ? 

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా