జగన్ మొనగాడు

జగన్ విషయంలో అవాకులు చవాకులు మాట్లాడిన వారిని సరైన జవాబు ఇచ్చారు. కేంద్రానికి జగన్ భయపడి పౌరసత్వ బిల్లు విషయంలో రాజీపడ్డారని విపక్షం కూసిన కారు కూతలకు జగన్ గట్టి జవాబే ఇచ్చారు. నిండు…

జగన్ విషయంలో అవాకులు చవాకులు మాట్లాడిన వారిని సరైన జవాబు ఇచ్చారు. కేంద్రానికి జగన్ భయపడి పౌరసత్వ బిల్లు విషయంలో రాజీపడ్డారని విపక్షం కూసిన కారు కూతలకు జగన్ గట్టి జవాబే ఇచ్చారు. నిండు అసెంబ్లీలో పౌరసత్వ బిల్లుల విషయంలో తన విధానం గట్టిగా చెప్పారు.

ఏపీలో మేము అమలుచేయలేమని కూడా  తీర్మానమే చేసి మరీ కుండబద్దలుకొట్టారు. ఇపుడూ అదే ముస్లిం మైనారిటీ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది. వారంతా జగన్ మొనగాడు అంటున్నారు. దీని మీద ఇన్నాళ్ళు రచ్చ చేసిన టీడీపీ నేతలు ఏమంటారని వైసీపీ మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ నిగ్గదీశారు.

ముస్లింల సంక్షేమం విషయంలో జగన్ కి సరిసాటి నాయకుడు ఏపీలో మరొకరు లేనేలేరని కూడా ఆయన అంటున్నారు. జగన్ విజన్ ఉన్న నేత అని, అదే సమయంలో ఆయన తాను ఇచ్చిన‌ మాట ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు, ముస్లిం మైనారిటీలకు అండగా ఉన్నారని కూడా రహమన్ అంటున్నారు.

ఈ దమ్ము,  ధైర్యం వర్తమాన రాజకీయాల్లో మరొకరిని లేవని ఆయన అన్నారు.  అందుకే నూటికి తొంబై శాతం ముస్లిం మైనారిటీలు జగన్ వెంటనే ఉన్నారని రహమాన్ చెప్పుకొచ్చారు.

జగన్ దార్శనికత గురించి చెబుతూ కరోనాతో కలసి కాపురం చేయాల్సిందేనని ఆయన అంటే నాడు టీడీపీ సహా అంతా ఎకసెక్కం ఆడారని, ఇపుడు జగన్ చెప్పిందే లోకమంతా పాటిస్తోందని కూడా రహమాన్ అనడం విశేషం. మొత్తానికి మైనారిటీలకు అండగా ఉంటున్న‌ జగన్ కి తాము ఎపుడూ రుణపడిఉంటామని రహమాన్ చెప్పుకొచ్చారు.

చైనాకి బుద్ధి చెబుదాం

మనది గొప్ప దేశం.. చైనాకి బుద్ధి చెబుదాం