ఓటీటీలోకి మరో హీరోయిన్.. ఈసారి ఇంకా కొత్తగా

మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, కాజోల్, జూహీ చావ్లా, రవీనా టాండన్, సుశ్మిత సేన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలా చాలామంది తారలు ఓటీటీలోకి అడుగుపెట్టారు. వీళ్లలో కొందరు క్లిక్ అయ్యారు కూడా. ఇప్పుడీ లిస్ట్…

మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, కాజోల్, జూహీ చావ్లా, రవీనా టాండన్, సుశ్మిత సేన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలా చాలామంది తారలు ఓటీటీలోకి అడుగుపెట్టారు. వీళ్లలో కొందరు క్లిక్ అయ్యారు కూడా. ఇప్పుడీ లిస్ట్ లోకి బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కూడా చేరింది. నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది కరీనా.

రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలు తగ్గించింది కరీనా. అదే టైమ్ లో ఓటీటీ అవకాశాల కోసం కూడా ఎదురుచూసింది. అలా కొన్ని కథలు విన్నప్పటికీ ఏదీ ఆమెకు నచ్చలేదట. ఫైనల్ గా సుజయ్ ఘోష్ చెప్పిన కథ బాగా నచ్చి ఓటీటీలో అడుగుపెట్టేందుకు అఁగీకరించింది.

జపనీస్ రచయిత కీగో హికషినో రచించిన ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ డ్రామా రాబోతోంది. ఓటీటీ స్టార్లు విజయ్ వర్మ, జయదీప్ అహ్లావత్ (పాతాల్ లోక్ ఫేమ్) ఇందులో నటించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ-ప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది కరీనా

నిజానికి 2019 నుంచి ఓటీటీలో మంచి డెబ్యూ కోసం ఎదురుచూస్తోందట కరీనా. కానీ సరైన టీమ్, సరైన స్టోరీలైన్ దొరక్క వెనక్కి తగ్గిందట. లేకపోతే పైన చెప్పుకున్న తారల కంటే ముందే తను ఓటీటీలోకి వచ్చి ఉండేదాన్నని చెబుతోంది కరీనా.